యాప్నగరం

ఎస్వీబీసీ ఛైర్మన్ పదవిపై జగన్ సర్కార్ నిర్ణయం.. ఛానల్ బాధ్యతలు ఆయనకే?

ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి సంబంధించి జగన్ సర్కార్ కీలక నిర్ణయం?. అదనపు ఈవో ధర్మారెడ్డిని ఛానెల్ ఎండీగా నియమించాలని భావిస్తున్న ప్రభుత్వం. రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలవడే అవకాశం?

Samayam Telugu 25 Jan 2020, 10:15 am
ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవికి సంబంధించి జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఛానల్‌ ఎండీగా టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డిని నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎస్వీబీసీ ఛానెల్‌ ప్రక్షాళనపై దృష్టిపెట్టిన ప్రభుత్వం.. ధర్మారెడ్డికి బాధ్యతలు అప్పగించాలని భావించిందట. అంతేకాదు ఛానెల్ ఛైర్మన్ పదవిని ఖాళీగా ఉంచే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఛానెల్‌కు అదనంగా మరో రెండు డైరెక్టర్ల పదవులు నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Samayam Telugu raj


వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్వీబీసీ ఛైర్మన్‌గా టాలీవుడ్ కమెడియన్, వైఎస్సార్‌సీపీ నేత పృథ్వీరాజ్‌‌ను నియమించారు. కానీ ఆయన ఛానెల్ ఉద్యోగినితో అసభ్యకరంగా మాట్లాడినట్లు ఆరోపణలు వచ్చాయి.. ఓ ఆడియో క్లిప్ కూడా వైరల్ అయ్యింది. దీంతో ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ వినిపించింది. ప్రజా, మహిళా సంఘాలు ధర్నాలు చేశాయి. తనపై ఆరోపణలు రావడంతో.. పృథ్వీరాజ్‌‌ తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు టీటీడీ కమిటీని ఏర్పాటు చేసింది.

గతంలో ఎస్వీబీసీ బోర్డు ఏర్పాటైన తర్వాత ఎండీ పోస్టులో టీటీడీ ఈవోనే ఉండేవారు. ప్రభుత్వం నియమించిన చైర్మన్‌కే ఎండీ బాధ్యతలనూ అప్పగిస్తూ వస్తున్నారు. టీడీపీ సర్కార్ హయాంలో ఛానెల్ బాధ్యతల్ని దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు చూసేవారు. సర్కార్ మారడంతో ఆయన పదవికి రాజీనామా చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.