యాప్నగరం

రైతుల కోసం జగన్ సర్కార్ కీలక నిర్ణయం

రూ.100కే ఐదు రకాల పండ్లు.. 8 అరటి పండ్లు, 5 స్వీట్ ఆరెంజ్, ఒక కర్బుజా, బొప్పాయి, 5 నిమ్మకాయలు అందజేస్తున్నారు. ఇటు అరటి పళ్లు కూడా తక్కువ ధరకే మార్కెట్‌లో దొరుకుతున్నాయి.

Samayam Telugu 18 Apr 2020, 8:08 am
లాక్‌డౌన్ వేళ రైతుల కోసం జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కష్టపడి పంటలు పండించిన అన్నదాతలు నష్టపోకుండా చర్యలు చేపట్టింది.. ప్రభుత్వం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతుల నుంచి పండ్లు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. పండ్లను కొనుగోలు చేసి కర్నూలు జిల్లాలో ప్రజలకు అతితక్కువ ధరలకే పంపిణీ చేస్తోంది. రూ.100 5 రకాల పండ్లు అందజేస్తోంది.. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రెడ్ జోన్ లో పంపిణీ చేస్తున్నారు.
Samayam Telugu knl


Read Also: ఏపీ: గ్రామ వాలంటీర్ అరెస్ట్.. తెలంగాణ నుంచి తెస్తూ అడ్డంగా బుక్!

రోగనిరోధక శక్తిని పెంచేందుకు కర్నూలు జిల్లా యంత్రాంగం ఈ చర్యలు తీసుకుంటుంది. రూ.100కే ఐదు రకాల పండ్లు.. 8 అరటి పండ్లు, 5 స్వీట్ ఆరెంజ్, ఒక కర్బుజా, బొప్పాయి, 5 నిమ్మకాయలు అందజేస్తున్నారు. ఇటు అరటి పళ్లు కూడా తక్కువ ధరకే మార్కెట్‌లో దొరుకుతున్నాయి. అటు రైతు నష్టపోకుండా ఇటు కరానో వంటి సమయంలో రోగ నిరోధక శక్తి పెరిగేలా ఇలా నిర్ణయం తీసుకున్నారు.

Also Read:
కర్నూలు వైద్యుడి ఇంట్లో ఆరుగురికి కరోనా.. మరో లేడీ డాక్టర్‌కు పాజిటివ్

మరోవైపు కడప జిల్లాలో రైతు బజార్లలో డజన్‌ అరటిపండ్లు రూ.5కే లభిస్తున్నాయి. గెల రూ.50–60లకు విక్రయించనున్నట్లు ఏడీ రాఘవేంద్రకుమార్‌ తెలిపారు. కడప, పులివెందుల, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె,బద్వేలు రైతు బజార్లలో ఈ అమ్మకాలు సాగుతాయని.. వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.