యాప్నగరం

ఏపీ: కౌలు రైతులకు జగన్ సర్కార్ శుభవార్త

'కౌలు రైతులకు జగన్ సర్కార్ శుభవార్తు. డిసెంబర్ 15 వరకు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపిన వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు. మిగిలిన రైతులకు ఈ నెల 15 వరకు అవకాశం.'

Samayam Telugu 12 Nov 2019, 9:31 am
ఏపీ ప్రభుత్వం కౌలు రైతులకు శుభవార్త చెప్పింది. వైఎస్సార్‌ రైతు భరోసాకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించేందుకు గడువు పెంచింది. డిసెంబర్ 15 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. అధికారులు, కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన మంత్రి కన్నబాబు, డిప్యూటీ సీఎం బోస్.. ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా కౌలురైతులు ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా గడువు పెంచినట్లు మంత్రి తెలిపారు.
Samayam Telugu ys jagan


Read Also: 'జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడే ఆ అనుమానం వచ్చింది'

కౌలు రైతులకు మాత్రమే గడువు పెంచామని.. మిగిలిన రైతులకు మాత్రమే ఈనెల 15 వరకు మాత్రమే అవకాశం ఉందన్నారు మంత్రి. అర్హులైన ప్రతి రైతుకు పథకాన్ని వర్తింపజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అంతేకాదు రైతు భరోసాకు సంబంధించి.. మూడు రోజుల పాటూ ప్రత్యేకంగా స్పందన కార్యక్రమాన్ని.. తహసీల్దారు కార్యాలయాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు స్పందన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతవారం నిర్వహించిన ప్రత్యేక స్పందనలో 2.89 లక్షల అర్జీలు వచ్చాయని.. వీటిని పరిష్కరించే పనిలో ఉన్నామన్నారు.

కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్ కూడా రైతు భరోసాపై సమీక్ష చేశఆరు. అర్హులైన ఏ ఒక్క రైతు, కౌలు రైతుకు రైతు భరోసా పథకం అందలేదన్న విమర్శ రాకూడదన్నారు. భావిస్తోంది.. ఎవరూ లబ్ధి చేకూరలేదనే విమర్శలు రాకుండా చూడాలని సీఎం భావిస్తున్నారు. రైతులు, కౌలు రైతుల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలన్నారు. సమస్యల్ని పరిష్కరిస్తే మరో 5 లక్షల మంది భూ యజమానులైన రైతులకు రైతు భరోసా పథకం వర్తిస్తుందని అంచనా వేస్తున్నారు అధికారులు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.