యాప్నగరం

జగన్ సర్కార్ కొత్త జీవో.. జర్నలిస్టులకు తిప్పలే!

2430 జీవోను తీసుకొచ్చిన ఏపీ ప్రభుత్వం. ఇకపై నిరాధారమైన వార్తలు రాసినా, ప్రచురించినా, ప్రసారం చేస్తే ప్రభుత్వం చట్టపరంగా చర్యలు. చర్యలు తీసుకునేందుకు ఆయా విభాగాల కార్యదర్శులకు అధికారం.

Samayam Telugu 30 Oct 2019, 10:37 pm
జగన్ సర్కార్ ఓ కొత్త జీవోను తీసుకొచ్చింది. 2430 జీవో ప్రకారం నిరాధారమైన వార్తలు రాసినా, ప్రచురించినా, ప్రసారం చేస్తే ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది. అంతేకాదు సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తులు, సంస్థలపైపా చర్యలు తప్పవు. ఈ వార్తలపై చర్యలు తీసుకునే అధికారాన్ని ఆయా విభాగాల (ప్రభుత్వశాఖల) కార్యదర్శులకు అప్పగించారు. కొత్త జీవో ప్రకారం.. నిరాధారమైన వార్తలు ప్రచురించే మీడియా సంస్థ పబ్లిషర్లు, ఎడిటర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అంతేకాదు న్యాయపరంగా కేసులు దాఖలు చేస్తారు.
Samayam Telugu cm jagan.


ఈ జీవోకు ఈ నెల 16న జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలపగా.. తాజాగా జీవోను విడుదల చేశారు. ఈ జీవోపై జర్నలిస్టు సంఘాలతో పాటూ ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. మీడియా స్వేచ్ఛను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. జగన్ సర్కార్‌ తీరుపై మండిపడ్డారు. ఈ జీవో మీడియా భావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా ఉందని ట్విట్టర్‌లో ఆరోపించారు.

‘ప్రశ్నించే హక్కు, విమర్శించే నైతికత, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడం ప్రజాస్వామ్యం కల్పించిన ఓ హక్కు. జగన్ ప్రభుత్వం ఇవాళ విడుదల చేసిన జీవో నెంబర్ 2430.. రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛను హరించే విధంగా ఉంది. అంటే సోషల్ మీడియాలో ప్రజల గొంతును నొక్కేయాలని దీన్ని అమలులోకి తెచ్చారా. ఈ జీవోతో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిన మీడియ సంస్థలపై, ప్రజలపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టాలనుకుంటున్నారా. ఈ జీవోని రద్దు చేసే వరకూ.. అవసరమైతే రోడ్లెక్కి నిరసనలు చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం’అంటూ ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.