యాప్నగరం

విశాఖలో 6 వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్‌కు జగన్ సర్కారు జీవో

విశాఖపట్నంలో 6 వేల ఎకరాలకుపైగా భూసేకరణకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. పేదలకు ఇళ్లు పథకం కింద పేదల కోసం ఈ భూములను సమీకరిస్తున్నారు.

Samayam Telugu 29 Jan 2020, 2:59 pm
విశాఖపట్నంలో ల్యాండ్ పూలింగ్ కోసం ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ‘పేదలకు ఇళ్లు’ పథకం కింద గృహ నిర్మాణానికి అవసరమైన భూముల కోసం జిల్లాలో భూ సమీకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు జీవో 72ను జారీ చేసింది. విశాఖ నగర పరిసరాల్లోని పది మండలాల్లో ప్రభుత్వం భూ సమీకరణ జరపనుంది. మొత్తం 55 గ్రామాల్లో 6,116.5 ఎకరాలు సేకరించాలని జగన్ సర్కారు భావిస్తోంది. తర్వాత ఒక్కో పేద కుటుంబానికి సెంటు చొప్పున భూమి ఇవ్వొచ్చని భావిస్తోంది.
Samayam Telugu vizag


విశాఖపట్నం డివిజన్లో 4663.63 ఎకరాల భూమిని సమీకరిస్తోన్న ప్రభుత్వం.. అనకాపల్లి డివిజన్లో 1452.87 ఎకరాలను సమీకరిస్తోంది. ఒక్కో మండలంలో ప్రభుత్వ భూములు ఎన్ని ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. అసైన్డ్ భూమి ఎంత ఉంది, ఇవి ఎవరి అధీనంలో ఉన్నాయనే విషయమై అధికారులు ఇప్పటికే సమాచారం సేకరించారు.

వారం రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చి 15 రోజుల్లో వెరిఫికేషన్ ప్రక్రియను చేపడతారు. విచారణ ముగిసిన 30 రోజుల్లో డెవలప్‌మెంట్ కోసం భూమిని వీఎంఆర్డీఏకు అప్పగిస్తారు. మూడు నెలల్లో భూమిని అభివృద్ధి చేసి ఐదు నెలల్లో అర్హులకు అందజేస్తారు.

జీవో నెం. 72 ప్రకారం అనకాపల్లి, ఆనందపురం, భీమునిపట్నం, గాజువాక, పెద్ద గంట్యాడ, పద్మనాభం, పరవాడ, పెందుర్తి, సబ్బవరం, విశాఖ రూరల్ ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.