యాప్నగరం

రిలయన్స్ సంస్థలపై దాడి కేసులో జగన్ సర్కార్ కీలక నిర్ణయం

వైఎస్ఆర్ మరణం తర్వాత ఏపీలో రిలయన్స్ సంస్థలపై దాడులు. పెద్ద ఎత్తున ఆస్తులనష్టం. సీఎం జగన్‌ను కలిసిన అంబానీ. రాజ్యసభ సీటు కోరిన రిలయన్స్ అధినేత.

Samayam Telugu 19 Mar 2020, 6:52 am
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఉమ్మడి ఏపీలో జరిగిన ఘటనలకు సంబంధించిన కేసుల్ని ఎత్తి వేసింది. వైఎస్ఆర్ మరణం తర్వాత ఏపీలో రిలయన్స్ సంస్థలపై వైఎస్ అభిమానులు దాడులు చేశారు. పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. అనంతపురం, గుంటూరు జిల్లాలో ఈ మేరకు కేసులు నమోదు అయ్యాయి. అయితే ఆ సమయంలో నమోదైన కేసుల్ని ఎత్తివేస్తున్నట్లు ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు విడుదల చేశారు. ఇటీవలే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబాని సీఎం జగన్‌ను కలిశారు. తన అనుచరుడుకి రాజ్యసభ సీటు ఇవ్వాలని కోరారు. దీంతో అంబానీ వ్యక్తి అయిన పరిమళ్ నత్వానికి పెద్దల సభ సీటు కేటాయించారు.
Samayam Telugu cm jagan.


దీంతో పాటు... గతంలో తూర్పుగోదావరి జిల్లా కాపు ఉద్యమ సమయంలో నమోదైన కేసుల్ని కూడా జగన్ సర్కార్ ఎత్తివేసింది. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ కాపు నేతలంతా ఆందోళనకు దిగారు. అదే విధంగా, నాడు కాపు ఉద్యమం సందర్భంగా చెలరేగిన హింసకు సంబంధించిన కేసులను, తునిలో జరిగిన రైలు దహనం కారణంగా నమోదైన మొత్తం 51 కేసులను ఎత్తివేశారు. చంద్రబాబు హయాంంలో కాపు ఉద్యమాన్ని నడిపించారు ముద్రగడ పద్మనాభం. చంద్రబాబు ప్రభుత్వం కాపులకిచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని ఎన్నోసార్లు ఆయన నిరసనకు దిగారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని చేసి, ఎన్నోరోజులు గృహనిర్బంధంలో కూడా మద్రగడ ఉన్నారు.

ఆ సమయంలో కాపు ఉద్యమానికి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మద్దతు పలికారు. అప్పట్లో సీఎంగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జగన్ తీవ్ర ఆరోపణలుచేశారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమం సమయంలో కుట్ర పూరితంగా రైలును తగలబెట్టించిన ఘనుడు ఏపీ సీఎం చంద్రబాబు అని ఆయన ఆరోపించారు. తుని లో జరిగిన భారీ బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. తుని రైలు దగ్దం ఘటనను ఆయన ప్రస్తావించారు. తుని నియోజకవర్గంలో కాపుల రిజర్వేషన్లకు వైఎస్సార్‌సీపీ తరపున సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే...తుని ఘటన నేపథ్యంలో నమోదైన కేసులన్నీ ఎత్తివేస్తున్నట్లు వైసీపీ సర్కార్ ప్రకటించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.