యాప్నగరం

జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆర్డినెన్స్ తెచ్చే ఆలోచన!

రూటు మార్చిన జగన్ సర్కార్.. లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో కీలక నిర్ణయం. బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు ఇబ్బందులు.. బడ్జె‌ట్‌పై తర్జనభర్జనలు. ఆర్డినెన్స్ తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం?

Samayam Telugu 25 Mar 2020, 10:01 am
జగన్ సర్కార్‌కు అసెంబ్లీ సమావేశాల రూపంలో పెద్ద సమస్య వచ్చి పడింది. ఏపీలో అసెంబ్లీ సమావేశాలను తప్పనిసరిగా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాక్‌డౌన్ ఈ నెల 31 వరకు ప్రకటించినా బడ్జెట్ సెషన్స్ నిర్వహించక తప్పేలా లేదు. దీని వెనుక ఆసక్తికరమైన కారణం ఉంది.. మార్చి 31 నాటికి వచ్చే ఆర్ధిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ని ఆమోదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 31లోగా రాష్ట్ర ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభ ఆమోదించకపోతే ఏప్రిల్ ఒకటి నుంచి.. రాష్ట్ర ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా వినియోగించలేని పరిస్థితి ఎదురవుతుంది. రాష్ట్ర వార్షిక ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Samayam Telugu jagan


Read Also: 'పోలీసులు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు.. ఇక మీ ఇష్టం'

బడ్జెట్ సమావేశాల సంగతి అలా ఉంటే.. జగన్ సర్కార్ అసెంబ్లీ సమావేశాలు లేకుండా బడ్జెట్‌పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్ల ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్డినెన్స్‌ రూపంలో తీసుకొచ్చే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. కేంద్రం కూడా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం సరికాదని భావిస్తున్న ప్రభుత్వం.. అందుకే ఆర్డినెన్స్ వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయట.

Also Read: విశాఖ: పోలీసులు చితక్కొడుతున్నా మారరా.. మీ కక్కుర్తి తగలెయ్యా

ఆర్డినెన్స్ నిర్ణయం వెనుక కారణాలు లేకపోలేదు.. బడ్జెట్‌ సమావేశాలు నిర్వహిస్తే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటూ భద్రతా సిబ్బంది, వారి సహాయకులు.. అధికారులు, వారి సహాయకులు, అసెంబ్లీ సిబ్బంది అసెంబ్లీకి వస్తారు. ఇది అంత శ్రేయస్కరం కాదని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఆర్డినెన్స్‌ ఉత్తమమైన మార్గమనుకుటోందట. దీనిపై రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి మార్చి నాటికి బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలి. స్థానిక సంస్థల ఎన్నికల ఎఫెక్ట్‌తో కుదరలేదు.. ఈ నెలాఖరులో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించింది. కానీ ఈలోపు కరోనా వైరస్, లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో సీన్ మొత్తం మారిపోయింది.

Must Read: ధరలు పెంచితే జైలుకే, 6 దాటితే అంతే.. పీడీయాక్ట్, ఏడ్చినా వదలం: కేసీఆర్

Also Read: ప్లీజ్.. ఇంటి ఓనర్లు అద్దె అడగొద్దు, సీఎం విజ్ఞప్తి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.