యాప్నగరం

మంత్రులకు జగన్ కీలక ఆదేశాలు.. ఇక నుంచి తప్పనిసరిగా..

ప్రజా సమస్యల పరిష్కారంలో అత్యంత శ్రద్ధ కనబరుస్తోన్న జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రులు ప్రతి బుధవారం సచివాలయంలో అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.

Samayam Telugu 28 Feb 2020, 12:45 pm
సీఎం జగన్ మంత్రుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ప్రతి బుధవారం మంత్రులు విధిగా సచివాలయంలో అందుబాటులో ఉండాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి, అర్జీలు అందించడానికి వీలుగా మంత్రులంతా ప్రతి బుధవారం సచివాలయానికి హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సంక్షేమ పథకాలతోపాటు, ప్రజా సమస్యలు తీర్చడానికి జగన్ సర్కారు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అందులో భాగంగానే గ్రామ, వార్డు స్థాయిల్లో వాలంటీర్ల ద్వారా సమస్యలను స్థానికంగానే పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. స్పందన కార్యక్రమం ద్వారానూ సమస్యలను పరిష్కరిస్తున్నారు.
Samayam Telugu ys jagan


ఇప్పుడు మంత్రులు కూడా సచివాలయంలో కచ్చితంగా అందుబాటులో ఉండటం ద్వారా సంబంధిత శాఖల సమస్యలు సత్వరం పరిష్కారమయ్యే అవకాశం ఉందని జగన్ భావిస్తున్నారు. తన పాలన పట్ల ప్రజల్లో సానుకూలత పెరగడం కోసం ఆయన ఏ విషయంలోనూ రాజీ పడటం లేదు.

గతంలో జరిగిన కేబినెట్ భేటీలో.. మంత్రులు ప్రతి మంగళవారం, బుధవారం విధిగా సచివాలయానికి రావాలని సీఎం ఆదేశించారు. కానీ దూరభారం, సంక్షేమ పథకాల అమలు, నియోజకవర్గాల్లో పనుల దృష్ట్యా మంత్రులకు వెసులుబాటు కల్పిస్తూ.. వారంలో ఒక్క రోజు ఉంటే సరిపోతుందని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.