యాప్నగరం

వరద బాధితులకు జగన్ సర్కార్ తక్షణ సాయం విడుదల.. ఎంతంటే

వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. యుద్ధ ప్రాతిపదికన సహాయ, పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని వర్షాలు, వరద ప్రభావిత జిల్లాల అధికారుల్ని ఆదేశించారు. హాయ శిబిరాల్లో ఉన్న వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు.

Samayam Telugu 17 Oct 2020, 7:03 am
Samayam Telugu సీఎం జగన్
ఏపీలో వరద బాధితులకు జగన్ సర్కార్ తక్షణ సాయం విడుదల చేసింది. భారీవర్షాలు, కృష్ణా, గోదావరి వరద ముంపు బారిన పడిన ఒక్కో బాధిత కుటుంబానికి రూ.500చొప్పున ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వారికి ఈ సాయం లభించనుంది. వీరికి ఈ సాయాన్ని అధికారులు అందజేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. యుద్ధ ప్రాతిపదికన సహాయ, పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని వర్షాలు, వరద ప్రభావిత జిల్లాల అధికారుల్ని ఆదేశించారు. సహాయ శిబిరాల్లో ఉన్న వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని.. వారికి రూ.500 చొప్పున ఇవ్వాలన్నారు. వారు ఇళ్లకు తిరిగి వెళ్లాక ఇబ్బందులకు గురి కాకుండా అన్ని విషయాలు ఆరా తీసి సహకరించాలని చెప్పారు. జిల్లాల్లో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై కలెక్టర్లను ఆరా తీశారు. అలాగే పంట నష్టంపై అంచనా వేయాలని అధికారులకు సూచించారు.

ఇదిలా ఉంటే భారీ వర్షాలు, వరదల వల్ల పంటలు నీట మునిగి రాష్ట్ర రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో 1,07,859 హెక్టార్లలో పంటలు దెబ్బ తిన్నట్లు జిల్లాల నుంచి అందిన ప్రాథమిక అంచనాలను బట్టి తెలుస్తోంది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 47,745 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. వరదల వల్ల వివిధ శాఖలకు కూడానష్టం వాటిల్లింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.