యాప్నగరం

ఏపీ: ఆరోగ్య ఆసరా ఉత్వర్వులు జారీ.. గర్బిణిలకు ఒక్కొక్కరికి రూ.3వేలు నుంచి రూ.5వేలు

రాష్ట్ర ప్ర‌భుత్వం గుర్తించిన నెట్ వ‌ర్కు ఆసుప‌త్రుల‌లో న‌మోదు అయ్యే ప్ర‌స‌వాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఆస‌రాను అంద జేస్తారు. ఈ ఆసరాను “Post–operative sustenance allowance” కింద ఇస్తారు.

Samayam Telugu 29 Sep 2020, 2:04 pm
ఏపీలో డాక్ట‌ర్ వైఎస్సార్ ఆరోగ్య ఆస‌రా ప‌థ‌కం కింద గ‌ర్భిణీల‌కు ఆరోగ్య ఆస‌రా మొత్తాన్ని పెంచిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్ర‌భుత్వం గుర్తించిన నెట్ వ‌ర్కు ఆసుప‌త్రుల‌లో న‌మోదు అయ్యే ప్ర‌స‌వాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఆస‌రాను అంద జేస్తారు. సాధార‌ణ డెలివ‌రీల‌కు రూ.5 వేలు.. సిజేరియ‌న్ డెలివ‌రీల‌కు రూ.3 వేలు చొప్పున సాయాన్ని అందించాల‌ని ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం (29-09-2020) ఉత్వర్వులు జారీ అయ్యాయి. ఈ ఆసరాను “Post–operative sustenance allowance” కింద అందిస్తారు.
Samayam Telugu ఆరోగ్య ఆసరా


గత వారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా కింద ప్రోత్సాహకాన్ని భారీగా పెంచుతున్నట్లు ప్రకటించారు. సాధారణ ప్రసవానికి ప్రస్తుతం ఇస్తున్న రూ. 3 వేలు ప్రోత్సాహకాన్ని రూ. 5 వేలకు, సిజేరిన్ ప్రసవానికి సంబంధించిన ప్రోత్సాహకాన్ని రూ. 1,000 నుంచి రూ. 3,000కు పెంచుతున్నట్లు వెల్లడించారు. తాజాగా ఉత్వర్వులు వచ్చాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.