యాప్నగరం

ఏపీలో స్కూల్ విద్యార్థులకు ముఖ్య గమనిక.. ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్‌ రిపేర్ వస్తే ఇలా చేయండి

Ap Govt Free Tab Repair In Village Secretariats విద్యార్థులకు పంపిణీ చేసిన ట్యాబ్‌లకు ఏవైనా సమస్యలు వస్తే వాటిని పరిష్కరించేందుకు సిద్ధమయ్యారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పరిష్కరించే పనిలో ఉన్నారు. ఈ మేరకు అధికారులు కీలక ఆదేశాలు ఇచ్చారు. విద్యార్థులు ఇబ్బందిపడకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి సచివాలయంలో ఈ విధానాన్ని తీసుకొస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 8వ తరగతి చదివే విద్యార్థులకు ప్రభుత్వం ట్యాబ్‌లు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 6 Apr 2023, 9:53 am
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు అందజేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు పంపిణీ చేశారు. ఒకవేళ ప్రభుత్వం పంపిణీ చేసిన ట్యాబ్‌లలో సమస్య వస్తే వాటిని పరిష్కరించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ట్యాబ్‌లలో ఏదైనా సమస్య వస్తే విద్యార్థులు ఇబ్బందిపడతారని భావించిన సర్కార్.. వాటిని గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పరిష్కరించేందుకు సిద్ధమయ్యారు.
Samayam Telugu ap govt to deal free tab repair through village and ward sachivalayams
ఏపీలో స్కూల్ విద్యార్థులకు ముఖ్య గమనిక.. ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్‌ రిపేర్ వస్తే ఇలా చేయండి


ఈ ట్యాబ్‌ల సర్వీస్‌కు సంబంధించి సచివాలయంలో వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్లు, వార్డు ఎడ్యు కేషన్‌ అండ్‌ డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీలను పర్యవేక్షణ కోసం నోడల్‌ అధికారులుగా నియమించారు. అంతేకాదు ఈ ట్యాబ్‌ల సర్వీస్‌కు సంబంధించి పర్యవేక్షణకు ఓ ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను కూడా సిద్ధం చేసింది గ్రామ, వార్డు సచి వాలయాల శాఖ. ట్యాబ్‌ రిపేర్‌‌కు సంబంధించిన ప్రక్రియపై కలె క్టర్లు, సచివాలయాల జిల్లా కో ఆర్డినేటర్లతో పాటు అన్ని గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు కూడా జారీ చేశారు.

ఎవరైనా విద్యార్థికి ట్యాబ్‌లో సమస్య వస్తే.. వెంటనే ఆ ట్యాబ్‌ను విద్యార్థి, తలిదండ్రులు, లేని పక్షంలో స్కూల్ టీచర్లు, హెడ్‌మాస్టర్లు ఎవరో ఒకరు తమ సమీపంలోని సచివాలయంలో పనిచేసే వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్లు, వార్డు ఎడ్యుకేషన్‌ అండ్‌ డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీలను కలవాలి. అక్కడ ట్యాబ్ అందజేయాలి.. రాష్ట్రంలోని అన్ని సచివాలయాల్లో ఈ విధానం ఉపయోగించుకునే అవకాశం ఉంది.

విద్యార్థి ట్యాబ్‌ రిపేరుకు సంబంధించిన ప్రక్రియ సమాచారం కోసం ఫోన్‌ నంబర్‌ను కూడా నమోదు ఎంట్రీ చేస్తారు. ట్యాబ్‌ సమస్య పరిష్కారమైన తర్వాత సంబంధిత సచివాలయ సిబ్బందే దానిని సేకరించి.. తిరిగి విద్యార్థికి అందజేయనున్నారు. ఒకవేళ ట్యాబ్ రిపేర్‌కు కుదరకపోతే వారంటీని బట్టి కొత్త ట్యాబ్‌ను సచివాలయ సిబ్బంది సేకరించి విద్యార్థికి అందజేస్తారు ఈ ప్రక్రియపై అవగాహన కోసం రాష్ట్రవ్యాప్తంగా వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్లు, వార్డు ఎడ్యుకేషన్‌ అండ్‌ డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీలకు శిక్షణ కూడా ఇవ్వనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 8 వ తరగతి చదువుతున్న 4,59,564 మంది విద్యార్థులు, 59,176 టీచర్లకు మొత్తంగా 5,18,740 ట్యాబ్‌లను పంపిణీ చేశారు. బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్తో వీటిని అందించారు. ప్రభుత్వం ఈ ట్యాబ్‌ల కోసం రూ. 1,466 కోట్ల ఖర్చు చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ విప్లవానికి శ్రీకారం చుట్టామని.. అలాగే పేద విద్యార్థులకు ఇంగ్లీష్‌ మీడియం, డిజిటల్‌ విద్యను అందిస్తున్నామరు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.