యాప్నగరం

విశాఖకు సీఎం క్యాంప్ ఆఫీస్ తరలింపు.. ముహూర్తం ఫిక్స్?

Visakhapatnam | గత కొన్నాళ్లుగా మరుగున పడిన మూడు రాజధానుల అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. విశాఖకు సీఎం క్యాంప్ ఆఫీసును తరలించడానికి ముహూర్తం ఖరారైందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

Samayam Telugu 11 May 2020, 12:45 pm
సీఎం క్యాంప్ ఆఫీసును అమరావతి నుంచి విశాఖ తరలించడానికి ముహూర్తం ఫిక్సయినట్లు సమాచారం. మే 28న ఉదయం 8.30 గంటలకు విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీస్‌ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని ప్రచారం జరుగుతోంది. ముందుగా అనుకున్నట్లు మిలినియం టవర్స్‌లో కాకుండా విజ్ఞాన్ కాలేజీ సమీపంలోని గ్రేహౌండ్ కాంపౌండ్‌లో సిద్ధంగా ఉన్న భవనాల్లోకి సీఎం క్యాంప్ ఆఫీసును తరలిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి 20 లారీల్లో ఫర్నీచర్ విశాఖ చేరుకుందనే వార్త చక్కర్లు కొడుతోంది.
Samayam Telugu సీఎం జగన్


సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అమరావతిలో అసెంబ్లీని కొనసాగిస్తూ.. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా, కర్నూలును జ్యుడీషియల్ క్యాపిటల్‌గా మార్చాలని జగన్ సర్కారు భావించింది. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌ ఇచ్చిన నివేదికలు సైతం ఇందుకు అనుకూలంగానే ఉన్నాయి. కానీ ఈ వ్యవహరం కోర్టుకు వెళ్లడం.. తర్వాత కరోనా తీవ్రం కావడంతో.. రాజధానుల అంశం పక్కకు వెళ్లింది.

ఇప్పటికీ కరోనా తగ్గని పరిస్థితుల్లో విశాఖకు సీఎం క్యాంప్ ఆఫీసును ఎలా తరలిస్తారనేది ఆసక్తికరంగా మారింది. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీక్ కావడంతో ‘రావాలి జగన్.. కావాలి జగన్’ అని విశాఖ వాసులు కోరుతున్నారని టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. దీనికి కౌంటర్‌గా క్యాంప్ ఆఫీసు తరలింపు విషయాన్ని ప్రచారం చేస్తున్నారనే భావన కూడా వ్యక్తం అవుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.