యాప్నగరం

సెప్టెంబరు 20 నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు

దేశంలోనే తొలిసారిగా గ్రామ, వార్డు సచివాలయం వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ప్రజల వద్దకే అన్ని ప్రభుత్వ సేవలను అందజేయడమే లక్ష్యంగా వీటిని ఏర్పాటుచేశారు.

Samayam Telugu 13 Aug 2020, 7:36 am
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీకి జనవరిలోనే నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం.. పరీక్షలను మార్చిలో నిర్వహిస్తామని తెలిపింది. అయితే, కరోనా వైరస్ కారణంగా వీటిని వాయిదా వేశారు. తాజాగా, ఈ ఉద్యోగ నియామక పరీక్షలను సెప్టెంబరు 20 నుంచి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని విభాగాల్లోనూ మొత్తం 16,208 ఉద్యోగాల కోసం వారం రోజుల పాటు పరీక్షలు నిర్వహించనుంది. వీటిలో గ్రామ సచివాలయం 14,602 పోస్టులు, వార్డు సచివాలయం 2,146 పోస్టులున్నాయి.
Samayam Telugu ఏపీ గ్రామ సచివాలయ ఉద్యోగాలు
AP Gram Sachivalyam


ఈ ఉద్యోగాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 10,63,168 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అభ్యర్థుల మధ్య భౌతికదూరం నిబంధనలు అమలుకు వీలుగా మొత్తం 3 నుంచి 5 వేల పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పరీక్షల నిర్వహణపై పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పరీక్షల నిర్వహణపై బుధవారం సమీక్షించారు. తొలిరోజు పరీక్షకు 4.5 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యే అవకాశమున్నందున కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని పరీక్షా కేంద్రాల్లో భౌతిక దూరం పాటించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

సచివాలయ ఖాళీల్లో ఎక్కువగా వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయని, వాటిని ఈసారి పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని మంత్రులు స్పష్టం చేశారు. అవసరమైతే పోస్టులకు అదే అర్హతతో కూడిన ప్రత్యామ్నాయ కోర్సులు చేసిన అభ్యర్థులకు కూడా అవకాశాన్ని కల్పించాలని ఆదేశించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.