యాప్నగరం

సీఎం వైఎస్‌ జగన్‌కు స్పెషల్ బర్త్ డే గిఫ్ట్

వంద ఉద్యోగాలు ఇవ్వడానికే ప్రభుత్వాలు సతమతమవుతున్న రోజుల్లో.. జగన్‌ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే లక్షా 30 వేల ఉద్యోగాలు ఇవ్వడం అసాధారణ విషయమన్నారు.

Samayam Telugu 14 Dec 2020, 7:34 am
ఈ నెల 21న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు. అదే రోజు సీఎంకు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలని ఉద్యోగులు నిర్ణయించారు. డిసెంబరు 21ని గ్రామ, వార్డు సచివాలయ దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించామని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి చెప్పారు. వంద ఉద్యోగాలు ఇవ్వడానికే ప్రభుత్వాలు సతమతమవుతున్న రోజుల్లో.. జగన్‌ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే లక్షా 30 వేల ఉద్యోగాలు ఇవ్వడం అసాధారణ విషయమన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా లక్షలాది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారని ప్రభుత్వ సేవలను ప్రజలకు వారి ఇంటి ముందే అందించే ఒక బృహత్తరమైన కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారని ప్రశంసించారు.
Samayam Telugu సీఎం జగన్


ఏపీ గ్రామ, వార్డు సచివాలయ సంఘం రాష్ట్ర కార్య నిర్వాహక కమిటీ సమావేశంకాగా.. నూతన కమిటీ ఎంపిక చేశారు. కమిటీ గౌరవ అధ్యక్షులుగా వెంకట్రామిరెడ్డి, అధ్యక్షుడిగా జీ.వీ రాఘవరెడ్డి, జనరల్ సెక్రెటరీగా అంకమ్మ రావు సహా 30 మందితో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో గ్రామ, వార్డు సచివాలయ దినోత్సవంకు సంబందించి ప్రకటన చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.