యాప్నగరం

నియోజకవర్గానికో ఐసోలేషన్ వార్డ్.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం

ప్రతి నియోజకవర్గంలో ఓ 100 పడకల ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయనున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు.

Samayam Telugu 23 Mar 2020, 6:02 pm
ప్రజలు సహకరిస్తేనే కరోనాను నియంత్రించగలమని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన జిల్లాల్లో ప్రజలను మరింత అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన తూర్పు గోదావరి జిల్లాలో మంత్రి నాని మీడియాతో మాట్లాడుతూ.. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నియోజకవర్గానికి ఓ 100 పడకల ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అలాగే 108 సిబ్బందికి అవసరమైన పరికరాలు, వస్తువులు అందించడంతో పాటు వారికి మనోధైర్యాన్ని నింపేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తక్కవగా ఉందని, ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు.
Samayam Telugu pjimage - 2020-03-23T180029.932


ప్రతి ఒక్కరూ సామాజిక దూరం, పరిశుభ్రత పాటిస్తే కరోనాను నియంత్రించగమని మంత్రి నాని అన్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఎవరైనా నిత్యవసర వస్తువుల ధరలు పెంచినా, బ్లాక్ మార్కెటింగ్ చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని మంత్రి హెచ్చరించారు. అలాగే కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకునే చర్యలకు ప్రజలందరూ సహకరించాలని మంత్రి నాని కోరారు.

ఏపీలో 6 కరోనా పాజిటివ్‌ బాధితుల ఆరోగ్య పరిస్థితి పరిస్థితి నిలకడగా ఉందని మంత్రి నాని తెలిపారు. ప్రస్తుతం ఏపీలో కరోనా వ్యాప్తి రెండో దశలో ఉందని, మూడో దశలోకి వెళ్లకుండా నిరోధించేందకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఇందు కోసం కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చిన జిల్లాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించమని సీఎం జగన్‌ ఆదేశించినట్లు చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.