యాప్నగరం

అందుకే కరోనా పరీక్షలకు చైనా కిట్లు తీసుకోలేదు: జవహర్‌రెడ్డి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచనలతోనే రాష్ట్రంలో కరోనా వైరస్ పరీక్షలు చేసేందుకు చైనా కిట్లను దిగుమతి చేసుకోలేదని వైద్య, ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌‌రెడ్డి తెలిపారు.

Samayam Telugu 29 Apr 2020, 11:04 pm
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సూచనలతోనే కరోనా వైరస్ (కోవిడ్ 19) పరీక్షలు చేసేందుకు చైనా కిట్లను దిగుమతి చేసుకోలేదని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌‌రెడ్డి వెల్లడించారు. చైనాను కాదని, దక్షిణ కొరియా నుంచి మాత్రమే కరోనా టెస్ట్‌ కిట్లను దిగుమతి చేసుకున్నామని వెల్లడించారు. ఐసీఎంఆర్‌ ఆమోదించాకే వాటిని పరీక్షలకు ఉపయోగించినట్లు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో అత్యధికంగా పరీక్షలు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలిచిందని వెల్లడించారు.
Samayam Telugu జవహర్ రెడ్డి


రాష్ట్రంలో ప్రతి 10 లక్షల మంది జనాభాకు 1,649 వైద్య పరీక్షలు చేస్తున్నట్లు జవహర్‌రెడ్డి వెల్లడించారు. ఇప్పటి వరకు ఏపీలో 88,061 మందికి పరీక్షలు చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికే 9 కరోనా ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

మరో రెండు రోజుల్లో మరో మూడు ల్యాబ్‌లు అందుబాటులోకి వస్తాయని జవహర్‌రెడ్డి చెప్పారు. ట్రూనాట్‌ ద్వారా 3,500 పరీక్షలు చేస్తున్నామని, వీఆర్‌డీఎల్‌ ద్వారా 4 వేల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కరోనాపై ముఖ్యమంత్రి జగన్‌ ప్రతిరోజూ సమీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పారు. రోజుకు 90 పరీక్షల నుంచి 7,750 పరీక్షలు చేసే సామర్థ్యానికి ఏపీ చేరుకుందని మంత్రి వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.