యాప్నగరం

జగన్ సర్కారుకు షాకిచ్చిన హైకోర్టు: వెంటాడుతున్న ఎస్ఈసీతో పాత పంచాయితీ!

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిసిపోయినా, అంతకముందు జరిగిన పరిణామాలు ఇంకా జగన్ సర్కారును వెంటాడుతున్నాయి. తాజాగా, ముఖ్య అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Samayam Telugu 22 Feb 2021, 6:34 pm
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిసిపోయినా, అంతకు ముందు జగన్ ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య జరిగిన వార్ ప్రభావం మాత్రం ఇంకా కనిపిస్తోంది. ఈ విషయంలోనే జగన్ సర్కారుకు ఏపీ హైకోర్టు మరోసారి షాకిచ్చింది. మాజీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదిలను న్యాయస్థానం ఎదుట హజరు కావాలని ఆదేశించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేసిన కోర్టు ధిక్కారణ పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది.
Samayam Telugu నిమ్మగడ్డ రమేష్ కుమార్


పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీకి సహకరించాలని చెప్పినా పట్టించుకోనట్లు వ్యవహరించడంపై సమాధానం చెప్పేందుకు వచ్చే నెల 22న హాజరు కావాలని హైకోర్టు సూచించింది. అనంతరం తదుపరి విచారణను వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం తమకు సహకరించడంలేదంటూ గతంలో ఎస్‌ఈసీ కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

గతంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కు సహకరించాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియ, కావాల్సిన నిధులకు సంబంధించి ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ క్రమంలో ఎస్‌ఈసీ పలుమార్లు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినా అందుకు సహకరించలేదన్న విషయాన్ని ఎస్‌ఈసీ న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీం కోర్టు ఆదేశాల తర్వాతే ఎస్‌ఈసీకి సహకరిస్తున్నారని, గతంలో సహకరించలేదని, ఎలాంటి సహాయ సహకారాలూ అందలేదని తెలిపారు. ఎస్‌ఈసీ న్యాయవాది వాదనలను పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం.. అధికారులు ఎందుకు సహకరించలేదో చెప్పాలని ఆదేశించింది. మార్చి 22వ తేదీన హైకోర్టులో హాజరుకావాలని సూచించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.