యాప్నగరం

ఏపీలో టెన్త్ పరీక్షల వాయిదాపై హైకోర్టులో వాదనలు.. ఇదే ఫైనల్, తేల్చి చెప్పిన జగన్ సర్కార్!

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఏపీ హైకోర్టు సోమవారం విచారణ జరిపింది.

Samayam Telugu 4 May 2021, 12:20 am
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వాహణపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని జగన్ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. టెన్త్ పరీక్షల నిర్వహణపై సోమవారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా టెన్త్ పరీక్షల నిర్వహణపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రశ్నించగా.. పరీక్షలకు ఇంకా సమయం ఉందని జగన్ సర్కారు పేర్కొంది. జూన్ 7వ తేదీ నుంచి టెన్త్ పరీక్షల షెడ్యూల్ ఉందని, ఈ లోపు రాష్ట్రంలో నెలకొనబోయే కరోనా పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ తరఫు న్యాయవాది సమాధానమిచ్చారు. టెన్త్ పరీక్షల వాయిదా విషయంపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు జూన్‌ 2వ తేదీకి వాయిదా వేసింది.
Samayam Telugu విద్యార్థులతో జగన్ పాదయాత్ర


కాగా, ఇటీవల కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ పరీక్షల నిర్వహణ విషయంలో పునరాలోచించాలని హైకోర్టు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే. తల్లిదండ్రులు, విద్యార్థుల ఆందోళనలను, మానసిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని పరీక్షల నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఆదేశించింది. అధికారులతో మాట్లాడి ఏ విషయం తమకు చెప్పాలని అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) శ్రీరామ్‌కు సూచించింది. ప్రభుత్వం తెలియచేసే వైఖరిని బట్టి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలోనే ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై పునరాలోచన చేయాలన్న హైకోర్టు చేసిన సూచనను పరిగణలోకి తీసుకుని.. పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఆదివారం ప్రకటించారు. ఈ తరుణంలో టెన్త్ పరీక్షలపై సందిగ్ధత నెలకొనగా, దీనికి ఇంకా నెల రోజులకు పైగా సమయం ఉండగా, అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని జగన్ ప్రభుత్వం తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.