యాప్నగరం

జగన్ సర్కార్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. కానీ ఒప్పందాలు చేసుకోవద్దని ఆదేశాలు

వ్యవసాయానికి 6,400 మెగావాట్ల విద్యుత్‌ కోసం పది సౌరవిద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు ఏపీ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ టెండర్లను ఆహ్వానించింది. ఆ నిబంధనలు కేంద్ర విద్యుత్‌చట్టానికి విరుద్ధంగా ఉన్నాయంటూ టాటా పవర్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ లిమిటెడ్‌ హైకోర్టును ఆశ్రయించింది.

Samayam Telugu 9 Jan 2021, 7:19 am
మెగా సోలార్ పార్క్ ప్రాజెక్‌ ఏర్పాటుకు సంబంధించి జగన్ సర్కార్‌కు ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. ప్రాజెక్టు ఏర్పాటుకు బిడ్డింగ్‌లో విజేతగా నిలిచిన కంపెనీతో ఒప్పందాలు తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు చేసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది.. కానీ బిడ్డింగ్‌ ప్రక్రియ కొనసాగించుకోవచ్చని తెలిపింది.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.గంగారావు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. వ్యవసాయానికి 6,400 మెగావాట్ల విద్యుత్‌ కోసం పది సౌరవిద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు ఏపీ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ టెండర్లను ఆహ్వానించింది. ఆ నిబంధనలు కేంద్ర విద్యుత్‌చట్టానికి విరుద్ధంగా ఉన్నాయంటూ టాటా పవర్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ లిమిటెడ్‌ హైకోర్టును ఆశ్రయించింది.
Samayam Telugu ఏపీ హైకోర్టు


ఈ పిటిషన్‌పై విచారణ జరగ్గా.. టాటా తరఫున వాదనలు వినిపించిన సీనియర్ లాయర్.. కేంద్ర ఇంధనశాఖ మార్గదర్శకాలకు విరుద్ధంగా విద్యుత్‌ కొనుగోలు ఒప్పంద నిబంధనలు ఉన్నాయన్నారు. విద్యుత్‌ చట్టంలోని సెక్షన్‌ 63కి అనుగుణంగా తాజాగా బిడ్డింగ్‌ ప్రక్రియ చేపట్టేలా ఆదేశించాలని కోరారు. ఈ ప్రాజెక్టు రైతుల ప్రయోజనం కోసం తీసుకొచ్చిందని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. టెండర్లు ముగిశాక పిటిషన్ దాఖలు చేయడం సరికాదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు బిడ్డింగ్‌ విజేతతో ఒప్పందాలు చేసుకోవద్దని గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ను ఆదేశించారు. ప్రతివాదులకు నోటీసులు ఇస్తూ కౌంటరు దాఖలు చేయాలన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.