యాప్నగరం

IAS ఉదయలక్ష్మికి హైకోర్టు భారీ షాక్.. ఆ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్!

రిటైర్డ్ ఐఏఎస్ ఉదయలక్ష్మికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది.

Samayam Telugu 15 Jun 2021, 6:18 pm
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఉదయలక్ష్మికి ఏపీ హైకోర్టు షాకిచ్చింది. మంగళవారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గతంలో ఓ పీఈటీ అధ్యాపకుడి విషయంలో ఉత్తర్వులను ఆమె భేఖాతరు చేశారని హైకోర్టు సీరియస్ అయింది. కోర్టు ధిక్కరణ కేసుగా పరిగణించి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గతంలో తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన పీఈటీ రత్నకుమార్ తనకు అన్యాయం జరిగిందంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో రత్నకుమార్‌కు న్యాయం చేయాలని అప్పటి ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న ఉదయలక్ష్మికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
Samayam Telugu ఐఏఎస్ ఉదయలక్ష్మి


అయితే ఆ ఆదేశాలను ఉదయలక్ష్మి అమలు చేయకపోవడంతో కోర్టు ధిక్కారణగా పరిగణించిన హైకోర్టు మంగళవారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణ సమయంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఉదయలక్ష్మిని హైకోర్టులో హాజరు పరచాలని గుంటూరు రూరల్ ఎస్పీకి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

అలాగే ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రస్తుత సీఎస్, అప్పటి ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అదిత్యనాథ్ దాస్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలపాటు వాయిదా వేసింది. కాగా, పిటిషనర్ తరుఫున హైకోర్టు సీనియర్ న్యాయవాది జొన్నలగడ్డ సుధీర్ వాదనలు వినిపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.