యాప్నగరం

ఎంపీ రఘురామకు ఊరట.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

Ap High Court On Mp Raghu Rama Custodial Petition ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఇద్దరు నేతలతో పాటూ మరో ఆరుగురు సీఐడీ అధికారుల కాల్ డేటాను భద్రపరచాలని కోర్టు ఆదేశించింది. సీఐడీ కూడా ఇంప్లీడ్ అయ్యింది.. ఈ పిటిషన్‌పై విచారణను వేసవి సెలవుల తర్వాత చేపడతామని కోర్టు తెలిపింది. సీఐడీ తనను కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిందని రఘురామ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 13 May 2023, 2:07 pm

ప్రధానాంశాలు:

  • ఎంపీ రఘురామ పిటిషన్‌పై విచారణ
  • ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది
  • కాల్ డేటా భద్రపరచాలని ఆదేశించారు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Mp Raghu Rama Krishnam Raju Cid
వైఎస్సార్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. తనను సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురి చేశారని దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఓ మంత్రి, మరో ఎమ్మెల్సీతో పాటూ ఆరుగురు సీఐడీ అధికారుల కాల్‌ డేటాను సేకరించి భద్రపరచాలని ఏపీ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. 2021 మే 14నుంచి 16 వరకు వీరి కాల్‌డేటాను భద్రపరచాలని సూచించింది.
2021లో తనను అరెస్ట్ చేసి కస్టడీలో చిత్రహింసకు గురిచేశారని.. ఈ వ్యవహారంపై హైకోర్టు పర్యవేక్షణలో సీబీఐ లేదా సిట్‌తో దర్యాప్తు చేయించాలని హైకోర్టును ఆశ్రయించారు ఎంపీ రఘురామ. సీఐడీ అధికారులతో పాటు మరో ఇద్దరు నేతల కాల్‌డేటాను భద్రపరిచేలా సీబీఐని అదేశించాలని పిటిషన్‌లో కోరారు. తనను టార్చర్ చేసిన సమయంలో ఇద్దరు నేతలు సీఐడీ కార్యాలయం సమీపంలో ఉన్నారని ఆరోపించారు. కాల్‌డేటా, సాంకేతికపరమైన ఆధారాలు, గూగుల్‌ టేక్‌అవుట్‌ వివరాలను భద్రపరచాలని కోరారు.

ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరగ్గా.. కాల్‌డేటాను భద్రపరిచేలా సీబీఐని ఆదేశించాలని రఘురామ తరఫు లాయర్ కోరారు. కోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తే ఆ వివరాలు సహాయపడతాయని ప్రస్తావించారు. గతంలో కాల్‌డేటాను ఏడాది మాత్రమే భద్రపరిచేవారని సీబీఐ తరఫున డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ కోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసు ఎఫ్‌ఐఆర్‌ సిఐడీ దగ్గర ఉందని.. అందుకే కాల్ డేటాను సీఐడీ అధికారులే సేకరించాలని వాదనలు వినిపించారు. పిటీషనర్ సిఐడీపై ఆరోపణలు చేస్తున్నారని.. అలాంటప్పుడు అదే సంస్థను కాల్ డేటా ఎలా సేకరించమంటారని న్యాయమూర్తి ప్రశ్నించారు.

అయితే 2021 డిసెంబర్‌లో రెండేళ్ల పాటూ డేటాను భద్రపరచాలని కేంద్రం నోటిఫికేష్ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ పిటిషనర్‌ను చిత్రహింసలకు గురించేసింది 2021 మే నెలలో అన్నారు. కాబట్టి డేటా విషయంలో సందేహం వ్యక్తం చేశారు. డేటా ఉంటే భద్రపరచాలని.. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తే ఆ డేటా కీలకంగా మారతుందన్నారు జడ్జి. ఈ పిటిషన్‌పై విచారణను వేసవి సెలవుల తర్వాత చేపడతామని కోర్టు తెలిపింది. మరోవైపు సీఐడీ హైకోర్టులో ఇంప్లీడ్ పిటీషన్ వేసింది. కాల్ డేటా సేకరించమనడం చట్టవిరుద్దమని సీఐడీ తరఫు లాయర్ వాదించారు. సీఐడీ ఇంప్లీడ్ పిటీషన్‌ను ఇంకా అనుమతించలేదని హైకోర్టు తెలిపింది. సీబీఐకు ఇవ్వాలా.. లేదా అనేది కోర్టు ఇంకా నిర్ణయించలేదని గుర్తు చేసింది.
మరోవైపు హైకోర్టు ఆదేశాలపై రఘురామ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'నా మీద జరిగిన కస్టోడియల్ టార్చర్ పై విచారణ జరపాలని కోరుతూ నేను వేసిన పిటీషన్ పై విచారణ సందర్భంగా నన్ను అదుపులోకి తీసుకున్న సమయంలో సంబంధిత అధికారుల కాల్ డేటాను స్వాధీనం చేసుకుని భద్ర పరచాలని సీబీఐకు హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది' అని తెలిపారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.