యాప్నగరం

YS Jagan సర్కారుకు ఏపీ హైకోర్టు బిగ్ షాక్: 4 వారాలే గడువు..!

జగన్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు మరోసారి బిగ్ షాకిచ్చింది. ఉపాధి పథకం బిల్లులకు సంబంధించి కీలక ఆదేశాలు..!

Samayam Telugu 24 Nov 2021, 8:29 pm
జగన్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరోసారి ఊహించని షాకిచ్చింది. ఏపీలో ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపులో జాప్యంపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన.. ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. తమకు బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తూ ఇబ్బంది పెడుతోందని ధర్మాసనానికి వివరించారు. న్యాయవాదులు వడ్డీని రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని న్యాయవాదులు కోరారు.
Samayam Telugu ఏపీ హైకోర్టు, సీఎం జగన్


దీంతో జగన్ ప్రభుత్వం తీరును ఏపీ హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. నాలుగు వారాల లోపు బిల్లులు చెల్లించకపోతే బిల్లుల మొత్తంపై వడ్డీని రద్దు చేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులు వర్తించబోవని ధర్మాసనం తేల్చిచెప్పింది.

4 వారాల్లో చెల్లించకపోతే వడ్డీ రద్దు ఉత్తర్వులు ఆటోమేటిక్‌గా రద్దు అయిపోతాయని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో ఎప్పటి నుంచో బిల్లుల కోసం ఎదరు చూస్తున్న ఉపాధి హామీ పథకం కాంట్రాక్టర్లకు ఊరట కలిగింది. అయితే, హైకోర్టు ఆదేశాలపై జగన్ సర్కారు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.