యాప్నగరం

రాజధాని తరలింపు: హైకోర్టుకు కీలక విషయం చెప్పిన వైసీపీ సర్కార్

అమరావతిలో స్థలం సరిపోకపోవడం వల్లే కార్యాలయాలను తరలించినట్లు ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని తరలింపుపై ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.

Samayam Telugu 18 Feb 2020, 3:55 pm
రాజధాని తరలింపుపై విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. అమరావతి నుంచి కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వయిరీస్‌, విజిలెన్స్‌ కమిషనర్‌ కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై రాజధాని రైతులు కోర్టును ఆశ్రయించగా కార్యాలయాల తరలింపుపై హైకోర్టు ‘స్టే’ ఇచ్చింది.
Samayam Telugu high court


Also Read: జగన్ సర్కారుకు షాక్.. హైకోర్టును ఆశ్రయించిన టీడీపీ

అనంతరం విచారణ చేపట్టింది. అయితే అమరావతిలోని సచివాలయ భవనాల్లో స్థలం సరిపోకపోవడంతోనే కార్యాలయాలను తరలించినట్లు రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో అమరావతిలో స్థలం సరిపోకపోతే వేరే భవనంలోకి మార్చకుండా ఇతర ప్రాంతానికి ఎందుకు మార్చుతున్నారని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. దీనిపై అఫిడవిట్ ఇవ్వాలని త్రిసభ్య ధర్మాసనం ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది.

ఈ నేపథ్యంలో మంగళవారం హైకోర్టులో వైసీపీ సర్కార్ అఫిడవిట్ దాఖలు చేసింది. సచివాలయ భవనాల్లో స్థలం కొరత కారణంగానే కార్యాలయాలను తరలిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అలాగే సచివాలయంలో సంబంధం లేని ఇతర కార్యాలయాల తరలింపు ప్రతిపాదన కూడా ఉన్నట్లు తెలిపింది. ఏపీ విజిలెన్స్ కమిషనర్, పీఆర్సీ కమిషనర్‌తో పాటు మరో 10 విభాగాల తరలింపుపై ప్రతిపాదనలు ఉన్నట్లు వెల్లడించింది. కర్నూలులో తగిన భవనాలు ఉన్నాయని కలెక్టర్ నివేదిక ఇచ్చారని, దీంతో కార్యాలయాలు తరలిస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.

Also Read: వైసీపీ నుంచి రాజ్యసభకు ఆ ముగ్గురు..! నాలుగో బెర్త్ ఆయనకేనా?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.