యాప్నగరం

ఇద్దరు IAS అధికారులకు జైలు శిక్ష.. ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు

ఏపీ హైకోర్టు ఇద్దరు ఐఏఎస్‌లకు జైలు శిక్ష విధించింది. కోర్టు తీర్పును అమలు చేయలేదంటూ ఆగ్రహించి..!

Samayam Telugu 22 Jun 2021, 4:34 pm
ఆంధ్రప్రదేశ్‌లోని ఇద్దరు ఐఏఎస్‌ అధికారులకు ఏపీ హైకోర్టు ఊహించని షాకిచ్చింది. హైకోర్టు తీర్పును అమలు చేయలేదని ఐఏఎస్‌ అధికారులకు జైలు శిక్ష విధించింది. హైకోర్టు తీర్పును అమలు చేయలేదని దాఖలైన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు చిరంజీవి చౌదరి, గిరిజా శంకర్‌ కోర్టుకు హాజరయ్యారు. విచారణ చేసిన హైకోర్టు వారిద్దరికీ వారం రోజుల పాటు జైలు శిక్ష విధించింది.
Samayam Telugu ఏపీ హైకోర్టు


36 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ (క్రమబద్ధీకరించాలి) చేయాలంటూ ఏప్రిల్‌లో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తర్వులు అమలు చేయాలంటూ పలుమార్లు ఆదేశించినప్పటికీ బేఖాతరు చేయడంతో ఐఏఎస్ అధికారి గిరిజా శంకర్, ఐఎఫ్ఎస్ అధికారి చిరంజీవి చౌదరికి కోర్టు వారం రోజుల పాటు జైలు శిక్ష విధించింది.

మంగళవారం విచారణకు అధికారులు ఇద్దరు వ్యక్తిగతంగా హాజరయ్యారు. విచారణ సందర్భంగా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం ఉత్తర్వులను పెడచెవిన పెట్టినందుకు గాను ఇద్దరికీ చెరో వారం రోజులు జైలు శిక్ష విధించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.