యాప్నగరం

రాజధాని తరలింపుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

రాష్ట్ర రాజధాని తరలింపుపై హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కార్యాలయ భవనాలను ఇతర ప్రాంతాలకు ఎందుకు తరలిస్తున్నారో చెప్పాలని ఆదేశించింది.

Samayam Telugu 12 Feb 2020, 8:06 pm
రాష్ట్ర రాజధాని తరలింపుపై బుధవారం హైకోర్టులో వాడివేడిగా వాదోపవాదనలు సాగాయి. పలు పిటిషన్లపై విచారణ సందర్భంగా హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. కార్యాలయాలకు అమరావతిలో స్థలం సరిపోకపోతే వేరే భవనంలోకి మార్చకుండా ఇతర ప్రాంతానికి ఎందుకు మార్చుతున్నారని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. దీనిపై అఫిడవిట్ ఇవ్వాలని త్రిసభ్య ధర్మాసనం ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది.
Samayam Telugu high court


Also Read: ఏ క్షణమైనా విశాఖ నుంచి పాలన: మంత్రి పెద్దిరెడ్డి

అలాగే ప్రస్తుతం సచివాలయంలో ఎంతమంది పనిచేస్తున్నారు, వారికి ఎంత స్థలం ఉందో తెలియజేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. విజిలెన్స్ ప్రధాన కార్యాలయం ఒక చోట, అధికారులు, సిబ్బంది మరోచోట ఉంటే విధులు ఎలా నిర్వహిస్తారో తెలియజేయాలని ఆదేశించింది. విజిలెన్స్ కమిషన్, జీఎడీ.. రెండూ ఎలా వేర్వేరో వివరించాలని సూచించింది.

పిటిషనర్లకు అక్షింతలు
మరోవైపు రాజధాని, కార్యాలయాల తరలింపు అంశాలను కాకుండా ఇతర విషయాలను ఎందుకు తీసుకొస్తున్నారని పిటిషనర్లకు ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వ సలహాదారులు అజేయ కల్లం, సజ్జల రామకృష్ణారెడ్డి సహా మరికొందరిపై దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు తప్పుపట్టింది. వారి వ్యాఖ్యలు, అధికారుల సర్వీసు రూల్స్ ఉల్లంఘన లాంటి అంశాలను ఈ పిటిషన్లలో కలపడం ఎందుకని ప్రశ్నించింది. అయితే ప్రభుత్వ సలహాదారులు కోర్టులపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది వివరించారు. దీంతో ఎవరేం మాట్లాడుతున్నారో అన్నీ తమ దగ్గర ఉన్నాయని, న్యాయవ్యవస్థ హుందాతనం ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Also Read: జగన్‌రెడ్డి గారూ.. ప్రీతికి న్యాయం చేయలేని సీఎం పదవి ఎందుకు: పవన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.