యాప్నగరం

AP Capital: జగన్ సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం.. కార్యాలయాల తరలింపుపై స్టే

ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై హైకోర్టు సీరియస్ కామెంట్స్. స్టేటస్ కో ఆదేశాలు ఇచ్చినా ఎందుకు తరలిస్తున్నారని ప్రశ్న.. ప్రభుత్వ తీరుపై కోర్టు ఆగ్రహం.. తరలింపుపై స్టే విధించిన కోర్టు.

Samayam Telugu 4 Feb 2020, 3:10 pm
కర్నూలుకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై హైకోర్టు స్టే ఇచ్చింది. రాజధానిపై పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని.. అలాంటప్పుడు ఆఫీసుల్ని ఎలా తరలిస్తారన్న ప్రశ్నించింది. ఫిబ్రవరి 26 వరకు స్టేటస్ కో ఆదేశాలు ఇచ్చామని హైకోర్టు గుర్తు చేసింది.. మధ్యాహ్నం తర్వాత పూర్తిగా విచారణ చేపట్టనుంది. ఈ కార్యాలయాల తరలింపు నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నదని.. ఇక్కడ కార్యాలయాల నిర్వహణ సరిగాలేదని ఏజీ కోర్టుకు వివరించగా.. స్థానికంగా ఉన్న స్థలంలోనే కొత్త నిర్మాణాలు చేపట్టొచ్చు కదా అంటూ జడ్జి ప్రశ్నించారు.
Samayam Telugu ap


రాజధాని తరలింపుపై హైకోర్టులో పిటిషన్‌లు దాఖలైన సంగతి తెలిసిందే. విచారణ జరిపిన కోర్టు ప్రభుత్వ కార్యాలయాలను తరలించొద్దని సూచించింది. కానీ ప్రభుత్వం గత శుక్రవారం రాత్రి కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వయిరీస్‌, విజిలెన్స్‌ కమిషనర్‌ కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ జీవో జారీ చేసింది. దీంతో అమరావతి రైతులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై కోర్టులో విచారణ జరిగింది.. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై మరికొన్ని పిటిషన్లు కూడా దాఖలయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.