యాప్నగరం

జగన్ సర్కారుకు బిగ్ షాక్.. ఏపీ హైకోర్టు సంచలన కామెంట్స్!

ఏపీలో ప్రభుత్వ ఎయిడెడ్ విద్యా సంస్థలకు చెందిన సమస్యపై రాష్ట్ర హైకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది.

Samayam Telugu 24 Sep 2021, 5:49 pm
జగన్ సర్కారుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బిగ్ షాకిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడెడ్‌ విద్యా సంస్థలను ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంటూ జారీ చేసిన జీవోపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ జీవోను సవాల్‌ చేస్తూ విద్యా సంస్థల అసోసియేషన్లు దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. విచారణలో భాగంగా ప్రభుత్వంపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
Samayam Telugu ఏపీ హైకోర్టు, సీఎం జగన్


ఎయిడెడ్‌ విద్యాసంస్థల అంగీకారాన్ని ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటోందని పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది ఎన్‌.సుబ్బారావు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అధికారులకు కడప డీఈవో జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను పిటిషనర్‌ ధర్మాసనం ముందు ప్రవేశపెట్టారు. విచారణలో భాగంగా పిటిషనర్‌ ప్రొసీడింగ్స్‌ను ప్రధాన న్యాయమూర్తి చదివి వినిపించారు. ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఎయిడెడ్‌ విద్యాసంస్థలపై ఒత్తిడి తీసుకొస్తున్నారనే విషయం కనపడుతోందని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది.

అలాగే, ప్రభుత్వంలోకి తీసుకొనేందుకు అంగీకరించిన విద్యాసంస్థల నుంచి మాత్రమే అంగీకారపు పత్రాలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మరో విధంగా జరగుతున్నట్లు తెలుస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. ఈ నెల 29వ తేదీన డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ధర్మాసనం ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను 29వ తేదీకి వాయిదా వేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.