యాప్నగరం

అది కశ్మీర్‌కే పరిమితమా.. అమరావతికి సొంత చట్టం ఉందా? హైకోర్టు ఆగ్రహం

పోలీసు ఆంక్షల పేరుతో పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలిగేలా ప్రవర్తించకూడదు.. శాంతియుత నిరసనలను అడ్డుకోరాదంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై తుళ్లూరు డీఎస్పీ చేసి వ్యాఖ్యలపై హైకోర్టు సీరియస్‌గా స్పందించింది.

Samayam Telugu 17 Jan 2020, 3:16 pm
రాజధాని రైతులపై కేసులు, గ్రామాల్లో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని ప్రాంత రైతులపై భారీగా కేసులు నమోద చేయడంపై వివరణ కోరొంది. రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్‌, 30 పోలీస్‌ యాక్టు అమలుపై అమరావతి రైతులు దాఖలు చేసిన ఏడు పిటిషన్లను విచారించిన ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వ న్యాయవాది(ఏజీ)పై ప్రశ్నల వర్షం కురిపించింది.
Samayam Telugu high court


రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేయడంపై హైకోర్టు ఏజీని ప్రశ్నించింది. దానికి ఏజీ సమాధానమిస్తూ 2014 నుంచే అమరావతిలో 144 సెక్షన్ ఉందని.. ప్రస్తుత ప్రభుత్వం పొడిగించిందన్నారు. రైతులపై కేసులు నమోదు చేయడాన్ని హైకోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించింది. అమరావతి ప్రాంతంలో 619 మందిపై కేసులు నమోదు చేయడంపై వివరణ కోరగా విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ర్యాలీకి వెళ్తున్నందునే వారిని అరెస్టు చేసినట్లు ఏజీ కోర్టుకు తెలిపారు.

Also Read: మూడు రాజధానులతో ముసలం.. జగన్ పద్మవ్యూహంలో విపక్షాలు.. బయటపడేనా?

అమరావతిలో మహిళల ఆందోళన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరును హైకోర్టు తప్పుబట్టింది. రాజధాని గ్రామాల్లో పోలీసుల కవాతు.. మందడం గ్రామంలో పోలీసులు మహిళను బూటు కాలితో తన్నిన ఘటనపై వరుస ప్రశ్నలు సంధించారు న్యాయమూర్తులు. మహిళలను అరెస్టు చేసే సమయంలోనూ అనుచితంగా ప్రవర్తించారని.. మగ పోలీసులతో మహిళలను ఎలా అరెస్టు చేయిస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది.

అమరావతిలో 144 సెక్షన్ అమలుపై తుళ్లూరు డీఎస్పీ వ్యాఖ్యలను హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 144 సెక్షన్ పేరుతో పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలిగేలా ప్రవర్తించకూడదని.. శాంతియుత నిరసనలను అడ్డుకోరాదని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై తుళ్లూరు డీఎస్పీ చేసి వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ఆ తీర్పు జమ్మూ, కశ్మీర్‌లో ఉన్న పరిస్థితులను ఉద్దేశించి ఇచ్చినదని.. అమరావతితో సంబంధం లేదని చెప్పడంపై న్యాయస్థానం సీరియస్ అయింది.

Read Also: విజయసాయి లెటర్.. అమిత్ షా ఆదేశాలు, చంద్రబాబుకు ఉచ్చు బిగుస్తోందా?

సుప్రీం కోర్టు తీర్పుపై డీఎస్పీ వ్యాఖ్యలను న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. అమరావతిలో ఎందుకు చెల్లదు? ఇక్కడేమైనా మీ సొంత చట్టం ఉందా? ఇలాగేనా 144 సెక్షన్ అమలు చేసేది అని ప్రశ్నించింది. ఇష్టమొచ్చినట్లు ప్రకటనలు చేయడమేంటని నిలదీసింది. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడాలని సుప్రీం కోర్టు ఆదేశాలు అమరావతిలో ఎందుకు అమలు కావని ప్రశ్నించింది. శాంతిభద్రతల సమస్యలు రాకూడదనే ఆంక్షలు విధించినట్లు ఏజీ న్యాయస్థానానికి తెలిపారు. తదుపరి విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.