యాప్నగరం

జగన్ సర్కార్‌కు ఎదురు దెబ్బ.. ఏపీ మూడు రాజధానుల గెజిట్‌పై హైకోర్టు స్టేటస్ కో

ఆగస్టు 14 వరకు స్టే వర్తిస్తుందని ఏపీ హై కోర్టు తెలిపింది. రిప్లై కౌంటర్ వేయాలని ఏపీ సర్కార్‌ను ఆదేశించింది.. తదుపరి విచారణను ఆగస్టు 14కు వాయిదా వేసింది.

Samayam Telugu 4 Aug 2020, 4:40 pm
ఏపీలో మూడు రాజధానులకు హైకోర్టు బ్రేకులు వేసింది. గవర్నర్ గెజిట్‌పై స్టేటస్ కో ఇచ్చింది. అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై స్టే విధించింది. ఆగస్టు 14 వరకు స్టే వర్తిస్తుందని కోర్టు తెలిపింది. రిప్లై కౌంటర్ వేయాలని ఏపీ సర్కార్‌ను ఆదేశించింది.. తదుపరి విచారణను ఆగస్టు 14కు వాయిదా వేసింది. గవర్నర్ ఇచ్చిన గెజిట్‌పై స్టే ఇవ్వాలని అమరావతి జేఏసీతో పాటూ మరికొందరు హైకోర్టులో పిటిషన్లు వేయగా.. మంగళవారం విచారణ జరిపి స్టేటస్ కో ఇచ్చింది.
Samayam Telugu ఏపీ హైకోర్టు


ఈ పిటిషన్లపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. పిటిషన్ల తరపున శ్యామ్ దివాన్, ఉన్నవ మురళీధర్ వాదనలు వినిపించారు. గత శుక్రవారం ఏపీ పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ప్రభుత్వం కూడా విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలను తరలించేందుకు సిద్ధమవుతోంది. ఇలాంటి సమయంలో హైకోర్టు స్టేటస్ కో ఇవ్వడం జగన్ సర్కార్‌కు ఎదురు దెబ్బ తగలిందని చెప్పాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.