యాప్నగరం

నవయుగ కాంట్రాక్ట్ రద్దు.. జగన్ సర్కారుకు హైకోర్టు షాక్!

నవయుగను పోలవరం ప్రాజెక్టు నుంచి తప్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీ టెండరింగ్‌కు ఇప్పటికే నోటిఫికేషన్ జారీచేసింది. అయితే, ఈ విషయంలో హైకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదరయ్యింది.

Samayam Telugu 22 Aug 2019, 12:11 pm
పోలవరం హైడల్ ప్రాజెక్టు పనుల ఒప్పందాన్ని ఏపీజెన్‌కో రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ నవయుగ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు గురువారం తీర్పును వెలువరించింది. హైడల్ ప్రాజెక్టు విషయంలో మధ్యంతర ఉత్తర్వులను వెలువరించిన హైకోర్టు.. రివర్స్ టెండరింగ్‌పై ముందుకు వెళ్లొద్దని పేర్కొంది. జల విద్యుత్‌ ప్రాజెక్టు పనులను ఇతరులకు అప్పగించకుండా నిలువరించాలని, తమనే కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని నవయుగ ఇంజినీరింగ్‌ సంస్థ హైకోర్టును అభ్యర్థించిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు తీర్పును రిజర్వ్‌లో ఉంచారు. హైడల్ ప్రాజెక్టు టెండర్ రద్దు విషయంలో ప్రభుత్వ వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది.
Samayam Telugu highcourt-ap1566311030


Read Also:జగన్ సర్కార్ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేసిన నవయుగ.. హైకోర్టులో వాదనలు

రివర్స్ టెండరింగ్ విషయంలో ముందుకెళ్లరాదని స్పష్టంచేసింది. నవయుగ కాంట్రాక్ట‌ను రద్దుచేస్తూ ఏపీజెన్‌కో ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేసింది. నిబంధనల ప్రకారం వేగంగా పనులు చేస్తున్న తమని తప్పించి రివర్స్ టెండరింగ్‌కు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వెళ్తోందంటూ పిటిషన్ దాఖలు చేసింది. జెన్‌కోతో ఒప్పందం చేసుకున్నప్పటి నుంచి..కాంట్రాక్ట్ విషయంలో తాము ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని నవయుగ తరఫున వాదనలు వినిపించిన లాయర్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

హైడల్ ప్రాజెక్ట్ కు ఏపీ జెన్‌కో సకాలంలో స్ధలం చూపించనందుకే ఆలస్యమైనందని తెలిపారు. ఎలాంటి కారణం చూపకుండా ప్రభుత్వం ప్రాజెక్ట్‌కు సంబందించిన కాంట్రాక్ట్‌ను ఎలా రద్దు చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటి వరకూ నిబంధనలు ఉల్లంఘించలేదని.. 2021 నవంబరు వరకు తమకు కాంట్రాక్ట్ గడువు ఉందని తెలిపారు.

Read Also: పీపీఏ సూచనలు జగన్ బేఖాతరు.. పోలవరం రీ-టెండరింగ్‌కు నోటిఫికేషన్!

హైడల్ ప్రాజెక్టు విషయంలో మాత్రమే కోర్టు తీర్పు వెలువరించడంతో పోలవరం హెడ్‌వర్క్స్‌కు ఎలాంటి సంబంధం ఉండదు. దీంతో హెడ్ వర్క్స్ విషయంలో ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. కాగా, పోలవరం ప్రాజెక్టు సంబంధించి రివర్స్ టెండరింగ్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 2015-16 ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం మొత్తం రూ.4,900 కోట్ల మేర టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ వెలువరించిన ప్రభుత్వం.. హెడ్‌వర్క్స్ రూ.1,800 కోట్లు, హైడల్ ప్రాజెక్టుకు రూ.3,100 కోట్ల పనులకు రివర్స్ టెండరింగ్‌ను ఆహ్వానించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.