యాప్నగరం

షోరూంలో జ్యోతిప్రజ్వలన చేసిన హోం మంత్రి.. ట్రెండ్ సెట్ చేస్తున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు

వైఎస్ఆర్సీపీ మహిళా ఎమ్మెల్యేలు ట్రెండ్ సెట్ చేస్తున్నారు. సాధారణంగా సినీ తారలు షోరూంలలో జ్యోతి ప్రజ్వలన చేస్తారు. కానీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, హోం మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Samayam Telugu 8 Sep 2019, 6:33 pm
ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు.. నిత్యం రాజకీయాల్లో ఫుల్ బిజీగా మారాల్సిందే. అదే హోం మంత్రి అయితే..? పాలన వ్యవహారాల్లో బిజీ బిజీగా ఉంటారు కదూ. ఎంత తీరిక లేకున్నా.. ఆదివారం ఒక్క రోజు కాసేపైనా రిలాక్స్ కావాలని కోరుకుంటారు. ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత కూడా ఆదివారం రోజు అలాగే రిలాక్స్ అయ్యారు. గుంటూరులోని ఓ షోరూం మూడో వార్షికోత్సవం సందర్భంగా.. ఆమె జ్యోతి ప్రజల్వన చేశారు. వైఎస్ఆర్సీపీకి చెందిన చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని, పత్తికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Samayam Telugu sucharitha1


ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలు కలిసి జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జ్యోతి ప్రజ్వలన చేశాక.. వీరు ముగ్గురూ కలిసి కాసేపు షాపింగ్ చేశారు. మాల్‌లో ఉన్న రకరకాల చీరలను చూసి ఈ చీర బాగుందంటే.. ఈ చీర ఇంకా బాగుందంటూ.. మాట్లాడుకున్నారు.
సాధారణంగా షోరూంలలో జ్యోతి ప్రజ్వలన, ఓపెనింగ్ లాంటి కార్యక్రమాల్లో సినీ తారలు పాల్గొంటుంటారు. కానీ ఈ షోరూం జ్యోతిప్రజ్వలన వేడుకలో హోం మంత్రి, మహిళా ఎమ్మెల్యేలు పాల్గొనడం గుంటూరు ప్రజానీకాన్ని ఆకట్టుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.