యాప్నగరం

బాధితులను విడిచిపెట్టే ప్రసక్తే లేదు.. ఏపీ హోం మంత్రి టంగ్ స్లిప్!

దాచేపల్లి ఘటనపై కేసు నమోదైందని.. ఆ మరుసటి రోజే నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కి కూడా తరలించారని ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. అత్యాచార ఘటనపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.

Samayam Telugu 29 Oct 2019, 6:42 pm
ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత టంగ్ స్లిప్ అయ్యారు. కంప్లైంట్ ఎవరిచ్చారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులో బాలికపై అత్యాచారం ఘటనపై హోం మంత్రి మాట్లాడుతూ తడబాటు పడ్డారు. బాధితులను విడిచిపెట్టేది లేదంటూ వ్యాఖ్యానించారు.
Samayam Telugu sucharithaa


దాచేపల్లి ఘటనపై కేసు నమోదైందని.. ఆ మరుసటి రోజే నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కి కూడా తరలించారన్నారు. గత ప్రభుత్వ హయాంలో మహిళలపై వేధింపుల్లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని.. పరిస్థితులు క్రమంగా మెరుగవతున్నాయని సుచరిత తెలిపారు. ఒక్కరోజులోనే అన్నీ చేసేస్తామని తాము చెప్పడం లేదన్నారు. గతంతో పోలిస్తే నేరాల సంఖ్య తగ్గిందని ఆమె చెప్పారు.

Also Read: వెంట్రుక కూడా పట్టలేకపోయారు.. చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

ఆ సందర్భంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ రాష్ట్రంలో అక్కడక్కడా అత్యాచార ఘటనలు జరుగుతున్నాయని, కఠినంగా వ్యవహరిస్తామన్నారు. దాచేపల్లి ఘటనపై సీఎం జగన్ కూడా స్పందించారన్నారు. అనంతరం తడబాటుకు గురయ్యారు.

బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సుచరిత అన్నారు. బాధితులు ఎంతటివారైనా విడిచిపెట్టేది లేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అవే వ్యాఖ్యలు నోరుజారిన హోం మంత్రి అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారు.

Read Also: అవి కుల భోజనాలు కాకూడదు.. జనసేనాని పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.