యాప్నగరం

గవర్నర్‌తో మండలి చైర్మన్ కీలక భేటీ.. జగన్ సర్కార్‌కు షాక్

గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌తో శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ భేటీ అయ్యారు. శాసనమండలిలో జరుగుతున్న పరిణామాలను గవర్నర్‌కు వివరించారు.

Samayam Telugu 6 Dec 2022, 5:55 pm
రాష్ట్ర శాసనమండలి చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ అయ్యారు. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో రాజ్‌భవన్‌కు చేరుకున్న షరీఫ్.. గవర్నర్‌తో కీలక అంశాలపై చర్చించారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపించే విషయంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.
Samayam Telugu Shareef


Also Read: వైసీపీ నుంచి రాజ్యసభకు ఆ ముగ్గురు..! నాలుగో బెర్త్ ఆయనకేనా?

గవర్నర్‌ను కలిసిన అనంతరం మండలి చైర్మన్ షరీఫ్ మాట్లాడుతూ.. సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు చేయాలని రెండు సార్లు ఆదేశించినా మండలి కార్యదర్శి సంబంధిత ఫైలును వెనక్కి పంపించారని తెలిపారు. చైర్మన్ ఆదేశించినా రూలింగ్ చేయకుండా కార్యదర్శి జాప్యం చేస్తున్నారని చెప్పారు.

మండలిలో జరిగిన పరిణామాలపై వివరించినట్లు షరీఫ్ తెలిపారు. చైర్మన్ ఆదేశాలను ధిక్కరించిన మండలి కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. సెలెక్ట్ కమిటీ నిబంధనలకు వ్యతిరేకంగా చేసింది కాదని స్పష్టం చేశారు. దీనిపై కల్పించుకుని వెంటనే సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు.

Also Read: అమరావతిలో భూములు కొన్న అనంతపురం పేదలు! ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ దూకుడు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.