యాప్నగరం

స్థానిక ఎన్నికల ఎఫెక్ట్.. పదో తరగతి పరీక్షలు వాయిదా

రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ శనివారం విడుదల చేయనున్నట్లు ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ వెల్లడించారు. ఎన్నికల ప్రభావంతో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి.

Samayam Telugu 6 Mar 2020, 9:19 pm
పదో తరగతి పరీక్షలు వాయిదా వేసుకుంటున్నట్లు బోర్డు అధికారులు చెప్పారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్ కుమార్‌ వెల్లడించారు. ఈ పరీక్షలను ఎన్నికల ప్రక్రియ అనంతరం ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారని వివరించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి మౌలిక వసతుల కల్పనకు సైతం పరీక్షల వాయిదా దోహదపడుతుందని చెప్పారు. అధికారులు ఇచ్చిన స్పష్టత కూడా ఎన్నికలు నిర్వహించేందుకు దోహదపడిందన్నారు. తొలుత మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, స్థానిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu tenth exams


Also Read: ఏపీ స్థానిక ఎన్నికలకు కరోనా దెబ్బ.. వాయిదా వేయాలంటూ..

అలాగే రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ శనివారం విడుదల చేస్తామని ఎన్నికల కమిషనర్‌ రమేష్ కుమార్‌ ప్రకటించారు. ఈవీఎంలపై పూర్తిస్థాయి విశ్వాసముందని, కానీ స్థానిక ఎన్నికలు మాత్రం బ్యాలెట్‌ పద్దతిలోనే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పంచాయతీతో పాటు మున్సిపల్‌ ఎన్నికలు కూడా బ్యాలెట్ పద్దతిలో నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలపై ఇప్పటికే జిల్లా కలెక్టర్, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు చెప్పారు. అలాగే ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరుతూ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో సమావేశమైనట్లు తెలిపారు.
Also Read: జనసేన కార్యకర్త పాడె మోసిన ఏపీ మంత్రి.. దారిపక్కన టీ కొట్టుకెళ్లి..

సింగిల్ డెస్క్ విధానం ప్రకారం ఎన్నికల ప్రచారానికి, సభలకు అనుమతి ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు కమిషనర్ వెల్లడించారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా ఇవ్వాలని, పాత పత్రాలు ఉన్నా అనుమతిస్తామని తెలిపారు. ఎన్నికల్లో ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అభ్యర్థులపై అనర్హత వేటు కూడా వేస్తామని ప్రకటించారు.

ఎన్నికల నిర్వహణకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సిబ్బంది సరిపోతారని, అవసరమైతే గ్రామ సచివాలయ సిబ్బందిని కూడా వినియోగిస్తామని చెప్పారు. ఎన్నికలపై కరోనా వైరస్‌ ప్రభావం ఉంటుందని పలువురు ఈసీ దృష్టికి తీసుకొచ్చారని, అయితే ఎన్నికల నిర్వహరణకు ఎలాంటి ఇబ్బంది లేదని రమేష్‌ కుమార్‌ స్పష్టం చేశారు.

Also Read: వైఎస్ జగన్ బాటలో మరో బీజేపీ ముఖ్యమంత్రి.. వైసీపీ కార్యకర్తల ఫుల్ ఖుషీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.