యాప్నగరం

ప.గో: పోలీసులొస్తున్నారని భయంతో పరుగు.. ఓ వ్యక్తి మృతి

జనాలు టిఫిన్ సెంటర్ దగ్గర ఉండగా అటువైపుగా వచ్చిన పోలీసులు.. భయంతో పరుగులు తీసిన జనాలు. పోలీసులు కొడతారేమోనని పరిగెత్తిన ఆంజనేయులు అనే వ్యక్తి.. పరిగెత్తుతున్న సమయంలోనే చనిపోయాడు.

Samayam Telugu 3 Apr 2020, 2:14 pm
ఏపీలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలెవరూ బయటకు రావొద్దని పోలీసులు, అధికారులు సూచిస్తున్నారు. పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. అకారణంగా ఎవరైనా రోడ్లపైకి వస్తే వాహనం సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. కొంతమంది ఆకతాయిలు మాటలు విననకపోవడంతో పోలీసులు అక్కడక్కడా లాఠీలకు పని చెబుతున్నారు. అయితే లాక్‌డౌన్ వేళ పశ్చిమగోదావరి జిల్లాలో విషాద ఘటన జరిగింది.
Samayam Telugu wg


శుక్రవారం ఉదయం పాలకొల్లులోని ఎల్‌ఆర్ నగర్‌లోని ఓ టిఫిన్ సెంటర్‌ దగ్గర జనాలు గుమిగూడారు. అదే సమయంలో పోలీసులు అటువైపుగా వచ్చారు.. ఈ కంగారులో జనాలు పోలీసులు కొడతారేమోనన్న భయంతో పరుగులు తీశారు. వీరిలో ఆంజనేయులు అనే వ్యక్తి కూడా పోలీసుల నుంచి తప్పించుకోవాలనే తొందరలో.. వారు కొడతారేమననే భయంతో పరుగులు తీశాడు.

ఆంజనేయులు అలా పరిగెడుతున్న క్రమంలో ఒక్కసారి కుప్పకూలిపోయాడు.. అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికులు కొందరు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఒక్కసారిగా పరిగెత్తడం వల్ల అతడి గుండె ఆగిపోయి ఉంటుందని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.