యాప్నగరం

ఏపీలో రెండు లైన్ల రోడ్లపైనా టోల్ ట్యాక్స్.. సీఎం జగన్‌కు లారీ ఓనర్ల లేఖ

YS Jagan: ఏపీలో రెండు లైన్ల రోడ్లపై కూడా టోల్ ఫీజు వసూలు చేస్తున్నారని లారీ ఓనర్ల సంఘం లేఖ రాసింది.

Samayam Telugu 20 Nov 2020, 11:31 pm
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లారీ ఓనర్స్ అసోసియేషన్ లేఖ రాసింది. రాష్ట్రంలో రెండు వరుసల రోడ్లపై టోల్ ఫీజు వసూలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని నిలిపివేయాలని కోరింది. ఈ మేరకు లారీ యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు సీఎం జగన్‌కు లేఖ రాశారు. రెండు వరుసల రోడ్లపై టోల్ వసూలు వల్ల ప్రజలు, రైతులు, రవాణా రంగంపై పెనుభారం పడుతుందని సీఎం దృష్టికి తీసుకొచ్చారు.
Samayam Telugu టోల్ ఫీజుపై సీఎం జగన్‌కు లేఖ


గత రెండేళ్లుగా రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని.. ఇటీవల లాక్డౌన్, కరోనా పరిస్థితుల వల్ల రవాణా రంగం మరింత క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ఈశ్వరరావు లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డీజిల్పై లీటర్‌కు 1.22 రూపాయల చొప్పున రోడ్ సెస్ వసూలు చేస్తోందని, ఇప్పుడు మళ్లీ రోడ్లపై టోల్ వసూలు చేస్తే భారం అధికం అవుతుందని వివరించారు.

2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తమ అభ్యర్థన మేరకు బ్రిడ్జిలపై టోల్ టాక్స్ రద్దు చేశారని ఈశ్వరరావు గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రోడ్లపై టోల్ విధించడం సరైన నిర్ణయం కాదని పేర్కొన్నారు. ఈ కారణాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర రహదారులపై టోల్ వసూలు ఆలోచన విరమించుకోవాలని లారీ యజమానుల సంఘం ముఖ్యమంత్రి జగన్‌కు విజ్ఞప్తి చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.