ఏపీలో కరోనా పంజా విసురుతోంది. రోజువారి కేసులు దాదాపు 15వేలకు చేరువలో ఉన్నాయి. ప్రభుత్వం కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ఇదిలా ఉంటే కరోనా బారినపడిన 18 ఏళ్లలోపు పిల్లలకు చికిత్సకు సంబంధించి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీచేసింది. ఒమిక్రాన్ వ్యాప్తికి సంబంధించిన కేంద్రం సూచనలకు అనుగుణంగా పిల్లల చికిత్స, కోవిడ్, నాన్–కోవిడ్ ప్రాంతాల్లో పనిచేసే వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గ దర్శకాలను విడుదల చేశారు. 18 ఏళ్లలోపు యాంటీవైరల్స్, మోనోక్లోనల్ యాంటీబాడిస్ వాడకూడదని వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ అన్నారు. 5 ఏళ్ల లోపు పిల్లలు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని.. ఇబ్బందులు లేకుండా ఉండేలా తల్లిదండ్రుల పర్యవేక్షణలో 6–11 ఏళ్ల పిల్లలు మాస్క్ వినియోగించవచ్చన్నారు. 12 ఏళ్లు, ఆ పైబడిన పిల్లలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని.. చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
అలాగే 15–18 ఏళ్ల పిల్లలు తప్పనిసరిగా టీకా వేసుకోవాలన్నారు. ఆస్పత్రుల్లో, వైద్యుల పర్యవేక్షణలోనే పాజిటివ్ అయిన పిల్లల చికిత్సలో స్టిరాయిడ్లు వినియోగించాలన్నారు. 2, 3 రోజులు జ్వరంతో బాధపడుతుండటంతోపాటు ర్యాష్, కళ్లకలక, హైపర్ టెన్షన్, శరీరంపై దద్దుర్లు, దురదలు, డయేరియా వంటి లక్షణాలున్నా.. ఈఎస్సార్ 40, సీఆర్పీ 5 కన్నా ఎక్కువగా ఉన్నా మిస్–సీగా పరిగణించి చికిత్స అందించాలని సూచనలు చేశారు.
లక్షణాలు లేనివాళ్లు, స్వల్ప లక్షణాలున్న వారికి యాంటీ బయోటిక్స్ వాడకూడదని చెబుతున్నారు. ఊపిరితిత్తుల్లో ఎక్కువగా ఇన్ఫెక్షన్ ఉన్నవారికి.. న్యూమోనియాతో బాధపడేవారికి, సెప్టిక్ షాక్కు గురైనవారికి మాత్రమే చికిత్సలో యాంటీ బయోటిక్స్ వాడాలని సూచించారు. 3–5 రోజుల్లో సిరాయిడ్స్ వాడకూడదని.. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని బట్టి 5వ రోజు నుంచి స్టిరాయిడ్స్ వినియోగించాలన్నారు. పరిస్థితిని బట్టి 10–14 రోజుల వరకు డోసు తగ్గించుకుంటూ వెళ్లాలన్నారు.
అలాగే 15–18 ఏళ్ల పిల్లలు తప్పనిసరిగా టీకా వేసుకోవాలన్నారు. ఆస్పత్రుల్లో, వైద్యుల పర్యవేక్షణలోనే పాజిటివ్ అయిన పిల్లల చికిత్సలో స్టిరాయిడ్లు వినియోగించాలన్నారు. 2, 3 రోజులు జ్వరంతో బాధపడుతుండటంతోపాటు ర్యాష్, కళ్లకలక, హైపర్ టెన్షన్, శరీరంపై దద్దుర్లు, దురదలు, డయేరియా వంటి లక్షణాలున్నా.. ఈఎస్సార్ 40, సీఆర్పీ 5 కన్నా ఎక్కువగా ఉన్నా మిస్–సీగా పరిగణించి చికిత్స అందించాలని సూచనలు చేశారు.
లక్షణాలు లేనివాళ్లు, స్వల్ప లక్షణాలున్న వారికి యాంటీ బయోటిక్స్ వాడకూడదని చెబుతున్నారు. ఊపిరితిత్తుల్లో ఎక్కువగా ఇన్ఫెక్షన్ ఉన్నవారికి.. న్యూమోనియాతో బాధపడేవారికి, సెప్టిక్ షాక్కు గురైనవారికి మాత్రమే చికిత్సలో యాంటీ బయోటిక్స్ వాడాలని సూచించారు. 3–5 రోజుల్లో సిరాయిడ్స్ వాడకూడదని.. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని బట్టి 5వ రోజు నుంచి స్టిరాయిడ్స్ వినియోగించాలన్నారు. పరిస్థితిని బట్టి 10–14 రోజుల వరకు డోసు తగ్గించుకుంటూ వెళ్లాలన్నారు.