యాప్నగరం

ఒళ్లు బలిసినోళ్లు.. అవును అన్నాను.. మళ్లీ, మళ్లీ అంటాను: మంత్రి అంబటి రాంబాబు

Ambati Rambabu మరోసారి విరుచుకుపడ్డారు. అమరావతి రైతుల పాదయాత్రపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అన్నాను, అంటాను.. మళ్లీ, మళ్లీ అంటాను అది ఒళ్లు బలిసినోళ్లు చేస్తున్న పాదయాత్ర అంటూ ట్వీట్ చేశారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 28 Sep 2022, 8:25 am

ప్రధానాంశాలు:

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Ambati Rambabu
ఏపీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) అమరావతి రైతుల పాదయాత్ర (Amaravati Farmers Padayatra)పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఒళ్లు బలిసిన వారు చేస్తున్న పాదయాత్ర అని విరుచుకుపడ్డారు. పాదయాత్రలో విద్వేషాలు రెచ్చగొట్టేలా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పాదయాత్ర పేరుతో కొంతమంది గుడివాడలో కొడాలి నానిపై తొడకొట్టారని.. ఇప్పుడు ఉత్తరాంధ్రకు వెళ్లి అక్కడ కూడా తొడలు కొట్టాలని చూస్తున్నారన్నారు. ఇలా తొడలు కొట్టినంతమాత్రాన వికేంద్రీకరణ ఆగదన్నారు. కృష్ణా జిల్లా కోడూరులో జరిగిన వైఎస్సార్‌ చేయూత మూడో విడత పంపిణీలో ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికే సీఎం జగన్‌ మూడు రాజధానులను కొనసాగించాలని చూస్తున్నారన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో గెలిచే పరిస్థితి లేదని.. తన పార్టీపై నమ్మకం లేక మిగిలిన పార్టీలతో కలిసి వెళ్లేందుకు ఆయన చూస్తున్నారని సెటైర్లు పేల్చారు. చంద్రబాబు ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో ఫెయిల్‌ అయ్యారన్నారు. ఇలాంటి పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబుకు ఓటు అడిగే హక్కు కూడా లేదన్నారు. టీడీపీని కాపాడేందుకే జనసేన పార్టీని పెట్టారని.. అలాంటి వారికి ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేష్‌, బాలకృష్ణ ఇలా.. ఎంత మంది కలిసి పోటీ చేసినా ఈసారీ జగన్‌మోహన్‌రెడ్డే ముఖ్యమంత్రి అవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మంత్రి అంబటి రాంబాబు. పేదప్రజల కోసం జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి బ్యాంకు ఖాతాలకు జమచేస్తున్నట్లే.. ప్రజలు రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఈవీఎం మిషన్‌పై ఫ్యాన్‌ గుర్తుకు ఓటువేసి వైఎస్సార్‌సీపీని గెలిపించాలని కోరారు. అలాగే ట్విట్టర్ వేదికగా.. అన్నాను..అంటాను.. మళ్లీ, మళ్లీ అంటాను.. అది వొళ్ళుబలిసినోళ్ల పాదయాత్ర అంటూ ట్వీట్ చేశారు. తాను చేసిన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.