యాప్నగరం

ఎస్పీ బాలుకు జగన్ సర్కార్ అరుదైన గౌరవం!

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను గౌరవించుకోవాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది.

Samayam Telugu 26 Sep 2020, 11:34 pm
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు మరణంపై తెలుగు ప్రజలంతా శోకసంద్రంలో మునిగిపోయారు. తన గాత్రంతో పండితుల నుంచి పామరుల వరకు కోట్ల మందిని అభిమానులుగా మార్చుకున్నారు. నెల్లూరు జిల్లాలో జన్మించిన ఎస్పీ బాలు.. ప్రపంచ వ్యాప్తంగా శ్రోతలను అలరించి కోట్ల మందిని అభిమానులను సంపాదించుకున్నారు. ఈ తరుణంలో ఎస్పీ బాలుకు గౌరవించుకోవాలని జగన్ సర్కార్ సంకల్పించింది. ఇందులో భాగంగా ఎస్పీ బాలు అంత్యక్రియలకు ఏపీ ప్రభుత్వం తరఫున రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. తిరువళ్లూరు జిల్లాకు వెళ్లిన అనిల్ కుమార్.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎస్పీ బాలుకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ మాట్లాడుతూ.. ఎస్పీ బాలు నెల్లూరులో పుట్టడం తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు గుర్తుగా నెల్లూరులో ఓ స్మారకాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని వెల్లడించారు. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి, అతి త్వరలోనే అధికారిక నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు.
Samayam Telugu ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం


అలాగే గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూయడం దురదృష్టకరమని బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్ తెలిపారు. ఎస్పీ బాలు భౌతికంగా మనకు దూరమైనా, ఆయన పాటలు మనతోనే ఉంటాయన్నారు. తాను చిన్నప్పటి నుంచి ఆయన పాటలు వింటూ పెరిగానని, బాలు గారు ఒక గొప్ప వ్యక్తి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

తన జీవితంలో ఒక్కసారైనా బాలసుబ్రమణ్యం గారిని కలవాలనే కోరిక ఉండేదని, ఆ కోరిక తనకు తీరలేదని ఎంపీ సురేష్ భావోద్వేగం చెందారు. బాలసుబ్రహ్మణ్యం కీర్తి, గౌరవానికి, తగినట్టుగా భారతరత్న ఇస్తే ఆయన అభిమానులకు ఊరట కలుగుతుందనే నమ్మకం ఉందన్నారు. దీనికి తన వంతు సహాయం చేస్తానని నందిగామ సురేష్ స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.