యాప్నగరం

TDP ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి.. మంత్రి అవంతి సవాల్

టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలని మంత్రి అవంతి శ్రీనివాస్ సవాల్.. టీడీపీ గెలిస్తే చంద్రబాబు వాదన సరైందేనని అంగీకరిస్తానన్న మంత్రి.

Samayam Telugu 16 Jan 2020, 7:34 am
విశాఖ రాజధాని ఎజెండాగా టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు మంత్రి అవంతి శ్రీనివాస్. టీడీపీ గెలిస్తే చంద్రబాబు వాదన సరైందేనని అంగీకరిస్తానని.. ఈ ఉద్యమం ప్రజల నుంచి వచ్చింద కాదని.. కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాలతో సృష్టించిందని ఆరోపించారు. రాష్ట్రంలో మిగిలిన జిల్లాలతో పోలిస్తే.. కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల ప్రజలు ఆర్థికంగా స్థితిమంతులని వ్యాఖ్యానించారు.
Samayam Telugu srinu.


రాష్ట్రంలో అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు మంత్రి అవంతి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలంతా ఆమోదించారని చెప్పుొచ్చారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు అమరావతిపై ప్రేమ ఉంటే గాజువాక నుంచి ఎందుకు పోటీ చేశారని ప్రశ్నించారు.

అమరావతి రాజధాని ఎజెండాగా వైఎస్సార్‌సీపీ 151మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఒకవేళ వైఎస్సార్‌సీపీ గెలిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. ఈ వ్యాఖ్యలకు కౌంటరిస్తూ.. మంత్రి అవంతి టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.