యాప్నగరం

ఏపీ మంత్రికి స్వల్ప అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

అస్వస్థతకు గురైన ఏపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు.. వెంటనే ఆస్పత్రికి తరలించిన సెక్యూరిటీ సిబ్బంది. కొద్దిరోజులుగా బోటు ప్రమాద స్థలంలో రెస్క్యూ ఆపరేషన్‌ పర్యవేక్షిస్తున్న మంత్రి.

Samayam Telugu 18 Sep 2019, 7:19 pm

ప్రధానాంశాలు:

  • మంత్రి విశ్రాంతి లేకపోవడం వల్ల అస్వస్థత!
  • మంత్రిని వెంటనే ఆస్పత్రికి తరలించిన సిబ్బంది
  • ఆస్పత్రిలో కోలుకున్న మంత్రి అవంతి శ్రీనివాస్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu avanthi
ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది దగ్గరలోనే ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు.. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. మంత్రికి కొద్ది రోజులుగా విశ్రాంతి లేకపోవడం వల్లే స్వల్ప అస్వస్థతకు గురయ్యారట. ఎలాంటి ఇబ్బందీ లేదని డాక్టర్లు చెబుతున్నారు.
Don't Miss: విజయసాయిరెడ్డికి కోడెల సాయం.. ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర బోటు ప్రమాదం జరిగిన మంత్రి అవంతి శ్రీనివాస్ వెంటనే ఘటనా స్థలానికి వెళ్లారు. ఆదివారం నుంచి సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. రాజమండ్రిలో ఉంటూ రోజూ ప్రమాద స్థలానికి వెళ్లి రెస్క్యూ ఆపరేషన్‌ను దగ్గరుండి చూస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం అవంతి అస్వస్థతకు గురయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.