యాప్నగరం

AP: నిరుద్యోగులకు జగన్ సర్కార్ మరో గుడ్‌న్యూస్.. ఆ నోటిఫికేషన్ జనవరిలో..

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో తీపికబురు అందించింది. కీలక శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు మంత్రి బాలినేని వెల్లడించారు. జనవరిలో నోటిఫికేషన్ వస్తుందన్నారు.

Samayam Telugu 10 Nov 2019, 10:57 pm
జగన్ సర్కార్ నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్ అందించింది. ఏటా ఉద్యోగ నియామకాలు చేపడతామని చెప్పిన ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనవరిలో ఉద్యోగాల భర్తీ కోసం మరో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు వెల్లడించింది. సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్న కీలక శాఖలో ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపింది.
Samayam Telugu forest-photo


అటవీ శాఖను సిబ్బంది కొరత వేధిస్తోందని.. దానిని అధిగమించేందుకు ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయనున్నట్లు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. పోస్టుల భర్తీకి జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2500 పోస్టులను భర్తీ చేయనున్నట్ల వెల్లడించారు. విశాఖ జిల్లాలో జరిగిన అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఆయన మాట్లాడారు.

Also Read: బాబోయ్.. మరీ అంత ఘోరంగానా.! డోస్ పెంచేసిన విజయసాయి

ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికడతామని మంత్రి తెలిపారు. అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అటవీ అధికారులకు నూతన ఆయుధాలు, వాహనాలు అందించనున్నట్లు చెప్పారు. వాహనాల కోసం ఇప్పటికే ప్రభుత్వం రూ.40 కోట్లు విడుదల చేసిందన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న 60 టన్నుల ఎర్ర చందనం విక్రయించేందుకు కేంద్రం అనుమతి కోరినట్లు చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.