యాప్నగరం

అమరావతి భూములు రాజధానికి అనుకూలం కావు: మంత్రి బొత్స

గత ప్రభుత్వం రూ.32 కోట్లు కాంట్రాక్టులు ఇచ్చింది. రాజధాని అమరావతిలో కొనసాగదని చెప్పడం లేదు.. జీఎన్ రావు నిపుణుల కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజల అభిప్రాయాలను సేకరిస్తుందని.. ఆ కమిటీ రాజధాని ఎక్కడ ఉండాలో నివేదిక ఇస్తుంది.

Samayam Telugu 12 Nov 2019, 10:52 am
ఏపీ రాజధాని అంశంపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.అమరావతి భూములు రాజధానికి అనుకూలం కావని.. భారీ భవనాలు నిర్మించడానికి అనువైనది కాదని వ్యాఖ్యానించారు. అమరావతిలో గత టీడీపీ ప్రభుత్వం సమీకరించిన భూముల అభివృద్ధికి ఎకరాకు రూ.కోటి ఖర్చు చేశారని ఆరోపించారు. అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి.. అమరావతి అంశంపై మరోసారి స్పందించారు.
Samayam Telugu satya


Read Also: ఏపీ: కౌలు రైతులకు జగన్ సర్కార్ శుభవార్త

రాజధానికి సంబంధించి నిర్మాణాల పేరుతో గత ప్రభుత్వం రూ.32వేల కోట్లతో కాంట్రాక్ట్‌కు ఇచ్చింది అన్నారు మంత్రి. ఈ నిధులన్నీ లే అవుట్లు, రోడ్ల నిర్మాణం కోసమే ఖర్చు చేశారని చెప్పారు. రూ.17వేల కోట్ల లే అవుట్ డెవలప్‌మెంట్‌కు టెండర్లు పిలిచారని.. అది కాకుండా మరో రూ.17వేలకోట్లు రోడ్ల నిర్మాణం కోసం టెండర్లు పిలిచారని చెప్పారు. మొత్తం రూ.32 కోట్లు టెండర్లకు పిలిచారని.. అంటే కేవలం లే అవుట్, రోడ్ల కోసమే ఎకరాకు కోటి రూపాయలు ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు.

అమరావతి మాత్రమే కాదు.. అనంతపురంలో రాజధాని ఏర్పాటు చేస్తామన్నా లక్ష ఎకరాల భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని.. విజయవాడ చిన్నది కాబట్టి 50వేల ఎకరాలు ఇవ్వొచ్చని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక రాజధాని అమరావతిలో కొనసాగదని తాము చెప్పడం లేదన్నారు బొత్స సత్యనారాయణ. జీఎన్ రావు నిపుణుల కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజల అభిప్రాయాలను సేకరిస్తుందని.. ఆ కమిటీ రాజధాని ఎక్కడ ఉండాలో నివేదిక ఇస్తుందన్నారు. ప్రజలు రాజధానిపై తమ అభిప్రాయాలను తెలియజేయొచ్చన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.