యాప్నగరం

విశాఖకు రాజధాని తరలింపునకు డేట్ ఫిక్స్: ఎప్పుడంటే.. సంచలన ప్రకటన

Visakhapatnam: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖపట్నం ఎప్పటి నుంచి అమలు కాబోతుందో మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.

Samayam Telugu 3 Jan 2021, 10:23 am
ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల వ్యవహారం రాష్ట్ర హైకోర్టులో నలుగుతున్న సమయంలో, అమరావతి ఉద్యమం ఉధృతంగా సాగుతున్న తరుణంలో జగన్ సర్కారు సంచలన ప్రకటన చేసింది. విశాఖపట్నంకు పరిపాలనా రాజధానిని తరలించడంపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు వారి కొత్త సంవత్సం ఉగాది పండుగ నుంచి విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా మారబోతోందని ప్రకటించారు. ఇకపై విశాఖలో పరిపాలనా రాజధాని ఉంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఉగాది నుంచి చట్టపరంగా విశాఖ నుంచి రాజధానిగా పరిపాలన కొనసాగుతుందని వెల్లడించారు.
Samayam Telugu ఏపీ 3 రాజధానులు


ఇక, రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసంపై టీడీపీ రాజకీయం చేస్తోందని మంత్రి బొత్స విమర్శించారు. ఇందులో ముమ్మాటికీ కుట్ర, రాజకీయ కోణం ఉందన్నారు. రెండు, మూడు రోజుల్లో వివరాలన్నీ బయటకి వస్తాయని ప్రకటించారు. రామతీర్థం ఆలయాన్ని అభివృద్ధి చేసింది తన భార్య బొత్స ఝాన్సీ అని మంత్రి వెల్లడించారు. అశోక్ గజపతిరాజు ట్రస్టీగా ఉండి కూడా ఏమీ చేయలేదని విమర్శించారు.
రామతీర్థం ఘటన ప్రతిపక్షాల కుట్ర అని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి విజయనగరం జిల్లా పర్యటనకు ముందు రోజే టీడీపీ ఈ కుట్ర చేసిందని, పోలీసుల దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించబోమని, బాధ్యులు ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రామతీర్ధ ఆలయాన్ని తామే అభివృద్ధి చేశామన్న మంత్రి బొత్స.. ఈ ఘటన జరిగిన వెంటనే విచారణకు ఆదేశించామన్నారు. ఈ ఘటనలో దోషులు ఎంతటి వారైనా శిక్షిస్తామని వెల్లడించారు. రామతీర్థంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించబోమని మంత్రి బొత్స హెచ్చరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.