యాప్నగరం

ఆ కారణంతోనే ట్రంప్‌తో విందుకు జగన్‌ను పిలవలేదు: ఏపీ మంత్రి బొత్స

'పొరుగునే ఉన్న నవీన్ పట్నాయక్ నాలుగు సార్లు ముఖ్యమంత్రి.. ఆయన్ను ఎందుకు పిలవలేదు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సీనియర్.. ఆమెకు ఎందుకు ఆహ్వానం అందలేదు.' అని ప్రశ్నించిన మంత్రి బొత్స.

Samayam Telugu 26 Feb 2020, 3:00 pm
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రాష్ట్రపతి ఇచ్చిన విందుపై ఏపీ రాజకీయ దుమారం రేగుతోంది. వైఎస్సార్‌సీపీ-టీడీపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబు ట్రంప్‌తో విందుకు పిలవకపోవడంపై.. సీఎం జగన్ టార్గెట్‌గా చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ నుంచి కౌంటర్లు మొదలయ్యాయి.
Samayam Telugu image


ట్రంప్‌తో విందుకు జగన్‌కు ఆహ్వానం అందకపోవడం, చంద్రబాబు చేసిన విమర్శలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. చంద్రబాబు కడుపు మంటతో సీఎం జగన్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. ఆయనే తెలివైనవారు.. మిగిలిన వారు అమయాకులు అనుకుంటున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రజలకు అన్నీత తెలుసని.. అంత అమాయకులు కాదన్నారు.

జగన్ మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు.. నవీన్ పట్నాయక్ నాలుగుసార్లు ముఖ్యమంత్రి.. ఆయనకు ఆహ్వానం ఎందుకు అందలేదని బొత్స ప్రశ్నించారు. బీజేపీ వాళ్ల సమీకరణలు ఆలోచనలు వాళ్లకు ఉంటాయని.. నవీన్ పట్నాయక్ నాలుగోసారి ముఖ్యమంత్రి కదా ఎందుకు పిలవలేదు.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఎందుకు ఆహ్వానం అందలేదని బొత్స ప్రశ్నించారు.

రాష్ట్రాల్లో ఎవరికైతే బలమైన నాయకత్వాలు ఉన్నాయి.. అలాంటి వాళ్లను పిలవలేదన్నారు మంత్రి. అందుకే జగన్‌కు పిలవలేదని తాము అనుకుంటున్నామరి.. అలాగే మరేవైనా కారణాలు ఉండొచ్చన్నారు. ఈ దేశంలో జగన్‌ బలమైన నాయకుడని తాము బలంగా నమ్ముతున్నాము అన్నారు. మీడియా ప్రతినిధులు చంద్రబాబు వ్యాఖ్యల్ని ప్రశ్నించగా.. వాటిపై ఆయన్నే వివరణ అడగాలన్నారు బొత్స. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.