యాప్నగరం

Amaravati రైతులకు గుడ్ న్యూస్.. అసెంబ్లీలో మంత్రి కీలక ప్రకటన

Ap Assembly| రాజధాని అమరావతిపై ఏపీ అసెంబ్లీలో చర్చ. అమరావతిపై తన వ్యాఖ్యల్ని వక్రీకరించారన్న మంత్రి బొత్స.. త్వరలోనే రైతుల ప్లాట్లను అభివృద్ధి చేస్తామని ప్రకటన.

Samayam Telugu 10 Dec 2019, 12:54 pm
ఏపీ అసెంబ్లీలో రెండో రోజు ఏపీ రాజధాని అమరావతిపై చర్చ జరిగింది. రాజధాని అంశంపై ముఖ్యమంత్రి జగన్ స్పష్టత ఇవ్వాలని.. కొత్త ప్రభుత్వం వచ్చాక రాజధానిపై అయోమయం ఏర్పడిందన్నారు టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్. కొత్త రాష్ట్రానికి తప్పనిసరిగా రాజధాని ఉండాలని.. అమరావతి ముంపు సమస్యలేదని గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రాజధాని నిలిపివేస్తే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు.
Samayam Telugu capital


Read Also: నేను అలా ఎక్కడా అనలేదు.. సాక్షిలో తప్పు రాశారేమో: జగన్

టీడీపీ ఎమ్మెల్యే ప్రశ్నపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే రైతుల ప్లాట్లను అభివృద్ధి చేస్తామని.. రాజధానిని అభివృద్ధి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు. అమరావతిపై తాను చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించారని.. టీడీపీ హయాంలో రాజధానిలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని చెప్పే ప్రయత్నం చేశానన్నారు. ఇక ఇండియా మ్యాప్‌లో అమరావతిని గుర్తించకపోవడానికి గత ప్రభుత్వమే కారణమని బొత్స వ్యాఖ్యానించారు.

Also Read: ఆ పాపంలో నేనూ భాగస్వామినే.. అందుకే శిక్ష అనుభవించా: స్పీకర్ తమ్మినేని

అసెంబ్లీలో మంత్రి బొత్స సత్యానారాయణ వ్యాఖ్యలతో రాజధాని ప్రాంత రైతులకు కాస్త ఊరట లభించిందనే చెప్పాలి. ముఖ్యంగా రైతుల ప్లాట్లను అభివృద్ధి చేసే ఆలోచనలో ఉందని చెప్పడం శుభవార్తగానే చెప్పుకోవచ్చు. అయితే దీనిపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో క్లారిటీ ఇస్తే బావుంటుందని టీడీపీ చెబుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.