యాప్నగరం

ఏపీ మహిళలకు సీఎం జగన్ శుభవార్త.. 11న వారందరి అకౌంట్లలో డబ్బు జమ

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 11న డ్వాక్రా మహిళల ఖాతాల్లో డబ్బు జమ చేయబోతున్నట్లు మంత్రి బొత్స తెలిపారు.

Samayam Telugu 9 Sep 2020, 9:12 pm
డ్వాక్రా మహిళల ఖాతాల్లో త్వరలోనే వైఎస్సార్ ఆసరా డబ్బు పడబోతున్నాయి. డ్వాక్రా సంఘాల అక్కచెల్లెమ్మలకు తోడ్పాటు అందించేందుకు ఈ నెల 11వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రారంభించబోతున్నారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అర్హులైన అందరికీ ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
Samayam Telugu ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి


పురపాలక సంస్థల కమిషనర్లు, మెప్మా, ఇంజినీరింగ్ తదితర విభాగాల అధికారులతో బుధవారం మంత్రి బొత్స వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, రాష్ట్ర కమిషనర్ విజయకుమార్, మెప్మా ఎండి విజయలక్ష్మి, ఇంజనీరింగ్ ఛీప్ చంద్రయ్య తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. మహిళల సంక్షేమానికి జగన్ సర్కార్ చేస్తున్న అన్ని కార్యక్రమాలపై అవగాహన కల్పించేలా ఈ నెల 11వ తేదీ నుంచి 17 వరకు ఆసరా వారోత్సవాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వైఎస్సార్ ఆసరా ద్వారా పట్టణ ప్రాంతాల్లో సుమారు 1.52 లక్షల స్వయం సహాయక సంఘాలకు మొదటి విడతలో సుమారు రూ.1,186 కోట్ల మేర లబ్ధి చేకూరనున్నదని ఆయన తెలిపారు. ఈ డబ్బును బ్యాంకులు పాత బకాయిలుగా జమ చేసుకోకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ నెల 11వ తేదీన ఆసరా కార్యక్రమ ప్రారంభోత్సవ వేడుకలను ప్రతి వార్డు సెక్రటేరియట్‌లో నిర్వహించాలని ఆదేశించారు. అలాగే త్వరలో ప్రారంభం కానున్న జగన్న తోడు పథకంపై కూడా మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్షించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.