యాప్నగరం

జగన్ దగ్గర ఆ పప్పులేమీ ఉడకవ్.. చంద్రబాబుపై మంత్రి బొత్స ఘాటు విమర్శలు

పెయిడ్ ఆర్టిస్టులతో చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారని మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు సీన్ సృష్టించారని ఆరోపించారు. బాబు జిమ్మిక్కులు మాకు తెలుసని, శాంతిభద్రతలకు కలిగించాలని చూస్తే ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

Samayam Telugu 12 Sep 2019, 5:18 pm
Samayam Telugu pjimage (48)
పల్నాడులో దాడులు జరుగుతున్నాయంటూ పెయిడ్ ఆర్టిస్టులతో చంద్రబాబు డ్రామాకు తెరతీశారని మంత్రి బొత్స ఘాటు విమర్శలు చేశారు. చలో ఆత్మకూరు విషయమై ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా పల్నాడు సీన్ సృష్టించారన్నారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని హెచ్చరించారు.

2014 ఎన్నికల అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఏం చెబితే అదే చేయాలని, దశ దిశ నిర్దేశించేది వారే అని అర్థం వచ్చేలా చేసిన ప్రసంగాన్ని గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. ‘ఇది మా రాజ్యం, వీళ్లంతా మా సేనాధిపతులు, మా మంది మాగదులు.. వాళ్లు చెప్పినట్లే చేయాలి’ అంటూ చంద్రబాబు చెప్పారన్నారు.

Must Read :పల్నాడులో రాజకీయ హత్య.! కత్తులతో దారుణంగా నరికి..

శాంతిభద్రతలపై సీఎం జగన్ తన వైఖరి ఏంటో కలెక్టర్ల సదస్సులోనే స్పష్టం చేశారన్నారు. పేకాట క్లబ్బులు, రౌడీయిజం, ఫ్యాక్షనిజాన్ని ఉపేక్షించొద్దన్నారు. ప్రజాప్రతినిధులకు విలువ ఇవ్వాలని, అంతేకానీ వారు చెప్పినవన్నీ చేయాల్సిన పనిలేదన్న సంగతి గుర్తు చేస్తున్నానన్నారు. చట్ట పరిధి దాటొద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారన్నారు.

Also Read : దళితులంటే ఎందుకంత చులకన? డిప్యూటీ సీఎం ఫైర్

కార్యకర్తలకు అనుగుణంగా నడుచుకోవాలని చెప్పిన పెద్ద మనిషి చంద్రబాబు అని బొత్స విమర్శించారు. ‘చంద్రబాబూ నీ జిమ్మిక్కులు చెల్లవు.. నీ గుణం మాకు తెలుసు.. నువ్వు ఇంకా పాత స్ట్రాటజీలనే ఫాలో అవుతున్నావ్.. జగన్ అలా కాదు.. నీ జిమ్మిక్కుల్లో జగన్‌ పడడు’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఆ పప్పులేం ఉడకవ్ అంటూ సెటైర్లు పేల్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.