యాప్నగరం

రైతుల పరామర్శకు వెళ్లిన పవన్‌కు కనీసం ఆ విషయమన్నా తెలుసా.. మంత్రి కాకాణి సెటైర్లు

Minister Kakani Govardhan Reddy జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతుల్ని పరామర్శిస్తున్నారు. ఇటీవల కురిసన వర్షాలకు పంటలు తడిసిపోవడంతో కష్టాల్లో ఉన్న అన్నదాతలను కలిసి ధైర్యం చెప్పారు. అయితే పవన్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అసలు పవన్ కళ్యాణ్‌కు వ్యవసాయం గురించి తెలుసా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు ఇన్‌పుట్ సబ్జిడీని పెండింగ్ పెట్టారని మంత్రి విమర్శించారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 11 May 2023, 1:39 pm

ప్రధానాంశాలు:

  • రాజమండ్రిలో పర్యటించిన మంత్రి కాకాణి
  • పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు
  • వ్యసాయం గురించి తెలుసా అని ప్రశ్నించారు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Kakani vs Pawan Kalyan
రైతులకు రాజకీయ నేతల పరామర్శల యాత్రలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. అధికారు, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. జనసేన పార్టీ (Jansena Party) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బుధవారం నుంచి పంట నష్టపోయిన రైతుల్ని స్తున్నారు.. ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలకు వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. జనసేనానిపై సెటైర్లు పేల్చారు.
పవన్ కళ్యాణ్‌కు అసలు రైతులు పంట ఎలా పండిస్తారో తెలుసా అని ప్రశ్నించారు మంత్రి. జనసేన అధినేతకు 10 పంటలు చూపిస్తే అందులో ఐదు పంటలను గుర్తించలేరని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం చంద్రబాబు, పవన్‌ను చూసి ధాన్యం కొనుగోలు చేయడం లేదని.. రోటీన్‌గానే కొనుగోళ్లు జరుగుతున్నాయన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు ఆనవాయితీగా ఇచ్చే ఇన్‌పుట్ సబ్సిడీని చెల్లించకుండా ఎగ్గొటారని విమర్శించారు. సీడ్ బకాయి, ధాన్యం కొనుగోళ్లు బకాయిలు కలిపి సుమారు రూ.5 వేల కోట్లు పెండింగ్‌లో ఉందన్నారు. వ్యవసాయం గురించి పూర్తిగా తెలుసన్నారు.
మరోవైపు ఆకాల వర్షాలకు దెబ్బతిన్న రైతుల కోసం తెలుగు దేశం పార్టీ పోరుబాట చేపట్టింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో శుక్రవారం రైతులతో భారీ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రైతు పోరుబాట పేరుతో రైతులతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర, సభ నిర్వహించనున్నారు. తణుకు నియోజకవర్గంలోని ఇరగవరం నుంచి తణుకు వరకు 12 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. 12న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పలు గ్రామాల మీదుగా సాగనున్న పాదయాత్ర కొనసాగనుంది. 12 (శుక్రవారం)న కార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం సాయంత్రమే చంద్రబాబు నాయుడు ఉండవల్లి నుంచి తణుకు వెళ్లనున్నారు.

మరోవైపు ఈ నెల 4, 5, 6 తేదీల్లో క్షేత్ర స్థాయి పర్యటన ద్వారా పంట నష్ట ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ ప్రతిపక్షం ఇచ్చిన డెడ్ లైన్ పై ప్రభుత్వం స్పందించలేదు. ప్రభుత్వ వైఫల్యంపై నిరసనగా భారీ స్థాయిలో రైతు పోరుబాట కార్యక్రమం చేపట్టింది. వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వకపోవడం, దెబ్బతిన్న ధాన్యం కొనుగోలు చేయక పోవడం పై ప్రభుత్వాన్ని నిలదీస్తూ రైతు పోరుబాట కొసాగనుంది. అకాల వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో అగ్రికల్చర్, హార్టి కల్చర్ పంటలకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.

మరోవైపు ట్విట్టర్‌లో ఇండియా వైడ్ గా 5 వ స్థానంలో ట్రెండ్ అవుతున్న #FarmersSufferingInAP అనే యాష్ టాగ్ ట్రెండ్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతన్నల కన్నీటి బాధలు పట్టించుకోని జగన్ రెడ్డికి కనువిప్పు కొరకు ట్విట్టర్ వేదికగా #FarmersSufferingInAP అనే యాష్ టాగ్ తో వేల సంఖ్యలో ట్వీట్స్ వేస్తున్నారు నెటిజన్లు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.