యాప్నగరం

Nandamuri Bala Krishna కు ఆ కుట్రలో భాగం ఉంది.. ఈయన చరిత్రలో నిలిచిపోయారు: ఏపీ మంత్రి కారుమూరి

Nandamuri Bala Krishna వ్యాఖ్యలకు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. ఫ్లూటు బాబు ముందు ఊదు.. జగన్ ముందు కాదు అంటూ ట్వీట్ చేశారు. అక్కడి ఉంది రీల్ సింహం కాదు.. రియల్ సింహం అన్నారు. తేడా వస్తే దబిడి దిబిడే అంటూ ఘాటుగా స్పందించారు. ఎన్టీఆర్‌‌ను పదవి నుంచి దించేయడానికి చంద్రబాబుకు సహకరించింది బాలయ్య అంటూ టార్గెట్ చేశారు. బాలయ్య కుట్రలో భాగమేనని.. ఆయన పంచ్ డైలాగులు కొడుతున్నారని ఎద్దేవా చేశారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 26 Sep 2022, 11:00 am

ప్రధానాంశాలు:

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Nandamuri Bala Krishna
ఎన్టీఆర్‌ (NTR)ను ముఖ్యమంత్రిగా దించేసి, కుంగి కృశించి మృతి చెందడానికి కారణమైన చంద్రబాబు (Chandrababu Naidu)ను భుజాలపైకి ఎక్కించుకోలేదా అని బాలకృష్ణను ప్రశ్నించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి కుర్చీలో కూర్చున్న చంద్రబాబుకు సహకరించింది బాలకృష్ణ (Nandamuri Bala Krishna) కాదా అన్నారు. సినిమాల్లో విలన్‌ లాంటి పాత్ర పోషిస్తున్న చంద్రబాబుకు మద్దతు పలుకుతున్నప్పుడే తండ్రిపై బాలయ్యకు ఎంత ప్రేమ ఉందో ప్రజలందరికీ అర్థమైందన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌కి ఎన్టీఆర్‌పై ప్రేమ ఉంది కాబట్టే ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టారని గుర్తు చేశారు.
అలాగే బాలయ్య ట్వీట్‌కి మంత్రి కౌంటర్‌గా మరో ట్వీట్ చేశారు. ‘ బాలయ్యా.. ఫ్లూటు బాబు ముందు ఊదు.. జగన్‌ ముందు కాదు.. అసెంబ్లీలో అంత క్లియర్‌గా చెప్పాకా కూడా వైలెన్స్‌ చేయాలి అనుకుంటే.. అక్కడ ఉన్నది రీల్‌ సింహం కాదు రియల్‌ సింహం జగన్‌... తేడా వస్తే మీ బావ, బామ్మర్దులకు దబిడిదిబిడే..’అన్నారు కారుమూరి.
తండ్రి కన్నీళ్లకు కరగని తనయుడిగా బాలకృష్ణ చరిత్రలో నిలిచిపోయారన్నారు మాజీ మంత్రి కన్నబాబు. ఎన్టీ రామారావును పదవి పోగొట్టి.. ఆయనపై రాళ్లు, చెప్పులు వేసి.. ఆయన మరణానికి కారకులైన వారు ఈ రోజు ప్రగల్భాలు పలుకుతున్నారని కౌంటర్ ఇచ్చారు. కన్నతండ్రి కన్నీళ్లు పెట్టుకుంటే కరిగిపోని కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటారా.. ఆ రోజు ఎన్టీఆర్ ఎంత ఆత్మక్షోభతో చనిపోయారో చెప్పడానికి ఈ రాష్ట్రమే సాక్ష్యమని వ్యాఖ్యానించారు. ఆ కుట్రలో బాలకృష్ణ కూడా ఒక భాగమని.. అటువంటి వ్యక్తి ఇప్పుడు పంచ్‌ డైలాగులు కొడుతున్నారని ఘాటుగా స్పందించారు.

కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని ఎన్నికల ముందు వాగ్దానం చేసిన వైఎస్‌ జగన్‌‌ది అన్నారు కన్నబాబు. అధికారంలోకి వచ్చాక ఆ మాట నిలబెట్టుకున్నారని.. జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు థ్యాంక్స్‌ చెప్పడానికి నోరుపెగలని నాయకులందరూ ఈరోజు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌పై చంద్రబాబు అండ్‌ కోకు ఎంత ప్రేమ ఉందో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు.

పోలవరం ప్రాజెక్టుకు ఇందిరాసాగర్‌ అనే పేరును రాజశేఖరరెడ్డి పెట్టారని.. ఆ తర్వాత చంద్రబాబు ఆ పేరును ఎందుకు మార్చారో చెప్పాలన్నారు మాజీ మంత్రి రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పేరును డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పెడితే ఎన్టీఆర్ పేరు పెట్టారని.. దానిని కూడా ఉంచాలా వద్దా అని.. వాడు, వీడు అని ఎన్టీఆర్‌ను సంబోధించారన్నారు. రాష్ట్ర ప్రజలు చరిత్రను మరచిపోరని.. దీనిపై బాలకృష్ణ ఆత్మపరిశీలన చేసుకుని మాట్లాడాలని.. డైలాగులు, పంచ్‌లు సినిమాల్లోనే పేలుతాయని, రాజకీయాల్లో పేలవని గుర్తు పెట్టుకోవాలన్నారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.